NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhrapradesh: రీస్టార్ట్‌ ఏపీలో భారీ పెట్టుబడులు.. 10 భారీ పరిశ్రమల ఏర్పాటు.. 33,966 మందికి ఉపాధి 
    తదుపరి వార్తా కథనం
    Andhrapradesh: రీస్టార్ట్‌ ఏపీలో భారీ పెట్టుబడులు.. 10 భారీ పరిశ్రమల ఏర్పాటు.. 33,966 మందికి ఉపాధి 
    రీస్టార్ట్‌ ఏపీలో భారీ పెట్టుబడులు.. 10 భారీ పరిశ్రమల ఏర్పాటు.

    Andhrapradesh: రీస్టార్ట్‌ ఏపీలో భారీ పెట్టుబడులు.. 10 భారీ పరిశ్రమల ఏర్పాటు.. 33,966 మందికి ఉపాధి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 20, 2024
    08:23 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధిపై తన తొలి ముద్రను వేసింది.

    "రిస్టార్ట్ ఏపీ" పథకం ద్వారా రాష్ట్రంలో భారీ పెట్టుబడుల రాబడి ప్రారంభమైంది.

    కూటమి అధికారం చేపట్టిన ఐదు నెలల వ్యవధిలోనే, పరిశ్రమలు, ఇంధన రంగాలకు సంబంధించిన 10 కీలక పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మంగళవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) తొలి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

    వివరాలు 

    స్టీల్ ప్లాంట్‌ల ద్వారా భారీ ఉపాధి 

    ఈ పరిశ్రమల ద్వారా రాష్ట్రానికి రూ. 85,083 కోట్ల పెట్టుబడులు లభించనున్నట్లు, సుమారు 33,966 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

    పారిశ్రామిక విధానాలకు అనుగుణంగా ఉద్యోగాల రీతిని ఆధారంగా తీసుకుని ప్రోత్సాహకాలను ఇవ్వాలని ఈ సమావేశం నిర్ణయించింది.

    ఆర్సెలార్ మిత్తల్ సంస్థ జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్స్‌తో కలిసి విశాఖపట్నం జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించగా, రూ. 61,780 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా 21,000 మందికి ఉపాధి లభించనుంది.

    వివరాలు 

    రక్షణ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులు 

    భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ రక్షణ రంగానికి అవసరమైన ఉత్పత్తులు తయారుచేసేందుకు రూ. 1,430 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటు చేయనుంది.

    అలాగే, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ రూ. 5,001 కోట్ల పెట్టుబడులతో వినియోగ వస్తువుల తయారీ పరిశ్రమను స్థాపించేందుకు ముందుకు వచ్చింది.

    ఇంధన రంగంలో భారీ ప్రాజెక్టులు

    వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో ఆస్తా గ్రీన్ ఎనర్జీ సంస్థ 1,800 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టు కోసం రూ. 8,240 కోట్ల పెట్టుబడులు ప్రకటించింది. అదనంగా, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సౌర మరియు పవన విద్యుత్ ప్రాజెక్టులు ప్రతిపాదించబడ్డాయి.

    వివరాలు 

    పెట్టుబడిదారులకు గౌరవం కీలకం: సీఎం 

    ప్రత్యేకించి పెద్ద పరిశ్రమలు రాబట్టడానికి ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు.

    భూసేకరణలో ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుతూ, న్యాయమైన పద్ధతులను అవలంబించాలని సూచించారు.

    ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడతాయని ఆశిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్

    Chandra Babu: విశాఖ-అమరావతి మార్గంలో వేగవంతమైన మార్పులు : చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు
    Andhrapradesh: ఈ నెల 11 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు పూర్తి స్థాయి బడ్జెట్..! ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు
    AP Government : ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. వారిపై కేసులు పెట్టేవారికి ర‌క్ష‌ణ‌ భారతదేశం
    Andhrapradesh: తెలంగాణ-ఆంధ్ర ప్రదేశ్ మధ్య కనెక్టివిటీకి కీలక అడుగు  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025