ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాకు అస్వస్థత; ఆస్పత్రిలో చేరిక
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా, నగిరి ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి రోజా సెల్వమణి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాళ్ల నొప్పులు, వాపులతో బాధపడుతూ శుక్రవారం చెన్నైలోని ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నారు. ఈ క్రమంలో శనివారం ఆమె అస్వసతకు గురికావడంతో వెంటనే అయార్ల్యాంప్ ప్రాంతంలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం ఒకటి, రెండు రోజుల్లో రోజాను డిశ్చార్జి చేయనున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ వార్త తెలిసిన రోజా అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఆమెకు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.