NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CM Chandrababu: అమరావతిలో డీప్‌ టెక్నాలజీ ఐకానిక్‌ భవనం.. 2029 నాటికి 5 లక్షల ఐటీ వర్క్‌స్టేషన్లు
    తదుపరి వార్తా కథనం
    CM Chandrababu: అమరావతిలో డీప్‌ టెక్నాలజీ ఐకానిక్‌ భవనం.. 2029 నాటికి 5 లక్షల ఐటీ వర్క్‌స్టేషన్లు
    అమరావతిలో డీప్‌ టెక్నాలజీ ఐకానిక్‌ భవనం.. 2029 నాటికి 5 లక్షల ఐటీ వర్క్‌స్టేషన్లు

    CM Chandrababu: అమరావతిలో డీప్‌ టెక్నాలజీ ఐకానిక్‌ భవనం.. 2029 నాటికి 5 లక్షల ఐటీ వర్క్‌స్టేషన్లు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 27, 2024
    08:36 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమరావతిని డీప్ టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.

    డీప్ టెక్నాలజీ, కృత్రిమ మేధ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతికతల మీద యువత భవిష్యత్తు ఆధారపడుతుందని పేర్కొన్నారు.

    మంగళవారం నాడు జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన కొత్త ఐటీ పాలసీకి సంబంధించిన అంశాలను చర్చించారు.

    ముఖ్యంగా ఐటీ సంస్థలు, అభివృద్ధికర్తల కోసం ప్రోత్సాహకాలు అందించే అంశంపై దృష్టి పెట్టారు.

    వివరాలు 

    డీప్ టెక్నాలజీ కోసం ప్రత్యేక ఐకానిక్ భవనం 

    ''హైదరాబాద్‌లో హైటెక్ సిటీ ద్వారా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసినట్లే, ఇప్పుడు డీప్ టెక్నాలజీ కోసం ప్రత్యేక అవకాశాలను సృష్టించాల్సిన అవసరం ఉంది'' అని సీఎం పేర్కొన్నారు.

    2029 నాటికి 5 లక్షలు, 2034 నాటికి 10 లక్షల వర్క్‌స్టేషన్ల ఏర్పాటు లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

    కో-వర్కింగ్ స్పేస్‌లు, కార్యాలయ సముదాయాల నిర్మాణానికి రాయితీపై భూములు లీజుకు ఇవ్వాలని, సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు.

    వివరాలు 

    స్టార్టప్‌లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు 

    స్టార్టప్‌ల అభివృద్ధి కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు రూ.25 లక్షల వరకు సీడ్ ఫండింగ్ అందించేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు.

    రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనుసంధానం

    రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జోనల్ ఇన్నోవేషన్ హబ్‌లను ఏర్పాటు చేసి, అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ హబ్‌లను దేశంలోని 25 ఐఐటీలతో అనుసంధానం చేసి, ఇన్నోవేషన్, స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను మరింత శక్తివంతం చేయాలన్నారు.

    రాయితీలతో సహజీవన కార్యాలయాలు

    ప్రభుత్వం కో-వర్కింగ్ స్పేస్‌లు, నైబర్‌హుడ్ వర్కింగ్ స్పేస్‌లు, ఐటీ క్యాంపస్‌లను అభివృద్ధి చేయడం కోసం రాయితీలు అందించాలని నిర్ణయించింది.

    వివరాలు 

    డీప్ టెక్నాలజీ రంగంలో ముందంజలో ఉండేలా ప్రణాళికలు: లోకేష్ 

    కో-వర్కింగ్ స్పేస్‌లకు కనీసం 100 సీట్ల సామర్థ్యం లేదా 10,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండాలి.

    నైబర్‌హుడ్ స్పేస్‌లకు 10 సీట్లు లేదా 1,000 చదరపు అడుగుల కార్యాలయ విస్తీర్ణం అవసరం. ఐటీ క్యాంపస్‌లు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండాలి.

    ఆధునిక ఐటీ పాలసీపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

    యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, రాష్ట్రం డీప్ టెక్నాలజీ రంగంలో ముందంజలో ఉండేలా ప్రణాళికలు రూపొందించామని అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    అమరావతి

    తాజా

    US Visas: వీసా గడువు కాలం మించితే భారీ జరిమానాలు.. శాశ్వత నిషేధం కూడా విధిస్తామన్న అమెరికా అమెరికా
    Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్‌కు డేట్ ఫిక్స్.. మేకర్స్ ట్వీట్‌తో హైప్‌! హరిహర వీరమల్లు
    Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు  ములుగు
    Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్  అజిత్ కుమార్

    చంద్రబాబు నాయుడు

    Chandrababu Naidu: 'ఆధునికాంధ్ర కోసం మా ప్రయాణం'.. చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీ
    AP Cabinet Meeting: కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక ప్రతిపాదనలపై చర్చించనున్న రాష్ట్ర మంత్రివర్గం.. ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్
    CBN Tributes to Tata: రతన్‌ టాటా మృతికి ఏపీ క్యాబినెట్‌ సంతాపం.. ముంబై బయలుదేరిన చంద్రబాబు, లోకేష్‌ ఆంధ్రప్రదేశ్
    AP Sand Policy : ఇసుక కొరతపై సీఎం కీలక ఆదేశాలు.. ఏపీలో నూతనంగా 108 ఇసుక రీచ్‌లు ఆంధ్రప్రదేశ్

    అమరావతి

    అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే మైలవరం
    అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌‌లో చల్లచల్లగా; రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు  ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట; చంద్రబాబు పాలనలో నిర్ణయాలపై విచారణకు లైన్ క్లియర్  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025