NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ankita Bhandari Case: అంకిత భండారి హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు.. ముగ్గురికి యావజ్జీవ శిక్ష!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Ankita Bhandari Case: అంకిత భండారి హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు.. ముగ్గురికి యావజ్జీవ శిక్ష!
    అంకిత భండారి హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు.. ముగ్గురికి యావజ్జీవ శిక్ష!

    Ankita Bhandari Case: అంకిత భండారి హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు.. ముగ్గురికి యావజ్జీవ శిక్ష!

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 30, 2025
    04:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2022లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంకిత భండారి హత్య కేసులో చివరకు న్యాయం జరిగింది.

    ఈ కేసులో ముగ్గురు నిందితులకు ఉత్తరాఖండ్‌లోని ఒక స్థానిక న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షను విధించింది.

    హోటల్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేస్తున్న అంకిత భండారి హత్య కేసుపై దేశమంతటా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

    తాజాగా కోర్టు తీర్పుతో ఆ బాధిత కుటుంబానికి న్యాయ పరంగా ఊరట లభించింది.

    ఈ దారుణ ఘటనలో బీజేపీ మాజీ నేత కుమారుడు పుల్కిత్ ఆర్యతో పాటు రిసార్ట్ మేనేజర్ సౌరభ్ భాస్కర్, మరో ఉద్యోగి అంకిత్ అలియాస్ పుల్కిత్ గుప్తాలను న్యాయస్థానం దోషులుగా తేల్చింది.

    వారు ముగ్గురూ అంకితను ప్రణాళికాబద్ధంగా హత్య చేసినట్టు తేల్చి, వారిపై యావజ్జీవ శిక్ష విధించింది.

    వివరాలు 

    కాలువలోకి తోసి హత్య

    అంకిత భండారి, పౌరి జిల్లాలోని యమకేశ్వర్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో ఉద్యోగినిగా పని చేస్తోంది.

    అదే రిసార్ట్ ఓనరైన పుల్కిత్ ఆర్య లైంగిక వేధింపులకు గురి చేసి,ఆమె తిరస్కరించడంతో,ఆమె పై కోపం పెంచుకొని హత్య చేశాడు.

    ఆమెను తమ వాహనంలో తీసుకెళ్లి, మద్యం సేవించిన తర్వాత, లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించగా అంకిత వ్యతిరేకించడంతో నిందితులు ఆమెను కాలువలోకి తోసి హత్య చేశారు.

    ఈ సంఘటన 2022 సెప్టెంబర్ 18న చోటుచేసుకుంది.అదే రోజున అంకిత గల్లంతైనట్లు పోలీసులకు ఫిర్యాదు వచ్చింది.

    ఆ రాత్రి సుమారు 8గంటల సమయంలో ఆమె నిందితులైన ముగ్గురితో కలిసి రిషికేశ్ వెళ్లింది.

    తిరిగివస్తూ చిలా రోడ్డులోని ఒక కాలువ దగ్గర వాహనం ఆపిన వారు,అక్కడే ఆమెను హత్య చేశారు.

    వివరాలు 

    దర్యాప్తులో మొత్తం 97 మందిని సాక్షులుగా గుర్తించారు

    ఈ హత్య కేసు దేశవ్యాప్తంగా ప్రజల ఆగ్రహానికి కారణమైంది. ఆరంభ దశలో దర్యాప్తులో జాప్యం, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి.

    అయితే ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు.

    దర్యాప్తులో మొత్తం 97 మందిని సాక్షులుగా గుర్తించారు. అయితే ఈ జాబితాలోని 47 మందిని మార్చి 28, 2023న తొలగించారు.

    తుదకు కోర్టు విచారణలో అన్ని ఆధారాలు పరిశీలించిన అనంతరం ముగ్గురు నిందితులపై యావజ్జీవ శిక్షను విధిస్తూ తీర్పును వెల్లడించింది.

    ఈ తీర్పుతో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అంకిత కుటుంబానికి కొంతవరకు న్యాయ పరంగా న్యాయం జరిగినట్లు భావించవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తరాఖండ్

    తాజా

    Ankita Bhandari Case: అంకిత భండారి హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు.. ముగ్గురికి యావజ్జీవ శిక్ష! ఉత్తరాఖండ్
    Virat Kohli: ఫైనల్ మ్యాచులో విరాట్ కోహ్లీ తప్పకుండా రాణిస్తాడు : ఏబీ డివిలియర్స్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    vaibhav suryavanshi: ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఆశీర్వాదాలు అందుకున్న ఐపీఎల్‌ సంచలనం వైభవ్ సూర్యవంశీ నరేంద్ర మోదీ
    Google: ఆపిల్‌-గూగుల్‌-ఫేస్‌బుక్‌ డేటా లీక్‌! 18.4 కోట్ల పాస్‌వర్డ్‌లు లీక్?  టెక్నాలజీ

    ఉత్తరాఖండ్

    UCC: నేడు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో 'యూనిఫాం సివిల్ కోడ్' బిల్లు  యూనిఫాం సివిల్ కోడ్
    UCC: సహజీవనానికి రిజిస్ట్రేషన్ లేకుంటే 6నెలు జైలు శిక్ష.. యూసీసీ బిల్లులో నిబంధనలు ఇవే.. యూనిఫాం సివిల్ కోడ్
    యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం భారతదేశం
    Haldwani: హల్ద్వానీ అల్లర్లలో ఇప్పటివరకు నలుగురు మృతి, 250 మందికి పైగా గాయాలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025