
Anna University: అన్నాయూనివర్సిటీ అత్యాచారం కేసులో సంచలన తీర్పు.... నిందితుడికి 30 ఏళ్ల జైలు శిక్ష
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో కలకలం రేపిన 19 ఏళ్ల అన్నా యూనివర్సిటీ విద్యార్థిని అత్యాచారం కేసులో కోర్టు కీలక తీర్పును ప్రకటించింది.
చెన్నైకు చెందిన మహిళా ప్రత్యేక న్యాయస్థానం,బాధిత యువతిపై లైంగిక దాడి చేసిన నిందితుడు జ్ఞానశేఖరన్కు జీవిత ఖైదు విధించింది.
స్థానికంగా బిర్యానీ అమ్మే వ్యాపారిగా ఉన్న జ్ఞానశేఖరన్కు,న్యాయమూర్తి ఎం. రాజలక్ష్మి జీవిత ఖైదుతో పాటు రూ. 90,000 జరిమానా కూడా విధించారు.
నిందితుడు కనీసం 30 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు.
గతంలో నిందితుడు కోర్టును శిక్షను తగ్గించాలంటూ విజ్ఞప్తి చేశాడు. తాను తన తల్లి,మైనర్ కుమార్తె బాధ్యత తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నాడు.
అయితే ఐదు నెలల పాటు జరిగిన విచారణ అనంతరం,న్యాయస్థానం అతనిపై శిక్షను ఖరారు చేసింది.
వివరాలు
కేసు నేపథ్యం
జ్ఞానశేఖరన్పై మొత్తం 11 ఆరోపణలు నమోదయ్యాయి. ఇందులో లైంగిక దాడి, అత్యాచారం, బెదిరింపు, కిడ్నాప్ వంటి ఘటనలు ఉన్నాయి. గత వారం న్యాయమూర్తి అతడిని దోషిగా గుర్తించారు.
ఈ కేసు విచారణలో మొత్తం 29 మంది సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. పోలీసులు 100 పేజీలతో కూడిన చార్జ్షీట్ను కోర్టులో సమర్పించారు.
ఈ కేసు తమిళనాడులో సంచలనం సృష్టించింది. 2023 డిసెంబర్లో చోటుచేసుకున్న ఈ దారుణ సంఘటన రాజకీయ పరంగా కూడా దుమారం రేపింది.
నిందితుడు డీఎంకే పార్టీకి చెందిన కార్యకర్తగా ఉండటంతో ఇది రాజకీయ మలుపు తిరిగింది.
మద్రాస్ హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి దర్యాప్తును ప్రారంభించింది.
వివరాలు
కేసు నేపథ్యం
చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో రెండవ సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థిని, డిసెంబర్ 23న తన స్నేహితుడితో మాట్లాడుతుండగా, జ్ఞానశేఖరన్ అకస్మాత్తుగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించి ఆమె స్నేహితుడిపై దాడి చేశాడు.
ఆపై యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను వీడియో రూపంలో చిత్రీకరించి ఆమెను బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నించాడు. ఇదే రోజు పోలీసులు జ్ఞానశేఖరన్ను అరెస్టు చేశారు.