తదుపరి వార్తా కథనం
    
    
                                                                                Marri Rajasekhar: వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా!
                వ్రాసిన వారు
                Jayachandra Akuri
            
            
                            
                                    Mar 19, 2025 
                    
                     10:46 am
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ (Marri Rajasekhar) తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు పోతుల సురేష్, కళ్యాణ చక్రవర్తి, కర్తి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మర్రి రాజశేఖర్ 2004లో చిలకలూరిపేటలో స్వతంత్య్ర ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని స్థాపించడంతో ఆ పార్టీలో చేరారు.