NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP: ఆర్5 జోన్​లో ఇళ్ల నిర్మాణానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్
    తదుపరి వార్తా కథనం
    AP: ఆర్5 జోన్​లో ఇళ్ల నిర్మాణానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్
    ఆర్5 జోన్​లో ఇళ్ల నిర్మాణానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

    AP: ఆర్5 జోన్​లో ఇళ్ల నిర్మాణానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 12, 2023
    04:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ సచివాలయం వేదికగా సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

    ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో వరుస కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తూ పెండింగ్ ఫైళ్ల దుమ్ముదులుపుతున్నారు. ఈ మేరకు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు చర్యలను వేగవంతం చేశారు.

    ఈ నేపథ్యంలోనే ఇవాళ కేబినెట్‌ భేటీ నిర్వహించారు. ఈ మేరకు పలు కీలకమైన ప్రాజెక్టులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    ఈ క్రమంలోనే స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశంలో పలు ప్రాజెక్టులకు గతంలో ఆమోదం లభించింది. వాటికి తాజా కేబినెట్‌ భేటీలో మంత్రివర్గం పచ్చ జెండా ఊపింది.

    సీఎం జగన్ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గంలో అమరావతి సీఆర్‌డీఏ పరిధి ఆర్5 జోన్‌లో ఉన్న 47 వేల నివాసలను నిర్మించేందుకు ఆమోదం ప్రకటించింది.

    DETAILS

    భూమిలేని నిరుపేదలకు వ్యవసాయ భూమి, లంక భూములకు ఆమోదం

    మరోవైపు శ్రీకాకుళం జిల్లా భావనపాడు-మూలపేటలో పోర్టు నిర్మించేందుకు ఉద్దేశించిన రూ.3,880 కోట్లు రుణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

    ఈ మేరకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తీసుకునేందుకు సమ్మతించింది. అలాగే రాష్ట్రంలో భూమిలేని నిరుపేదలకు వ్యవసాయ భూమి, లంక భూముల కేటాయింపునకు ఆమోదించింది.

    అన్నమయ్య జిల్లాలోని వేంపల్లి వద్ద జిందాల్ న్యూ ఎనర్జీ కంపెనీకి సంబంధించిన 1500 మెగావాట్ల పంపెడ్ స్టోరేజీ ప్రాజెక్టుకి సైతం ఆమోదం లభించింది.

    టిడ్కో కాలనీల్లోని 260 ఎకరాలను విక్రయించి, హడ్కో నుంచి రూ. 750 కోట్లు రుణంగా తీసుకునే ప్రతిపాదనలకు సైతం అంగీకారం తెలిపింది.

    గండికోట రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ. 454 కోట్ల పరిహారం ప్యాకేజీని మంజూరీకి ఒకే చెప్పింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    తాజా

    Motivation: ప్రయత్నం ఆపకూడదు.. ప్రయత్నమే విజయానికి దారి జీవనశైలి
    ISRO: 18న ఇస్రో 101వ రాకెట్‌ ప్రయోగం: చైర్మన్ వి నారాయణన్ ఇస్రో
    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ

    ఆంధ్రప్రదేశ్

    ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు ఒంటిపూట బడులు  పాఠశాల
    భౌగోళిక గుర్తింపు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ ఆత్రేయపురం పూతరేకులు  భారతదేశం
    AP ICET 2023: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల; ర్యాంకు కార్డును తీసుకోండి  పరీక్ష ఫలితాలు
    వైజాగ్ ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్; గంటల వ్యవధిలోనే కాపాడిన పోలీసులు  విశాఖపట్టణం

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్-2023 సమావేశాలు ప్రారంభం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేరు వాడుకొని రూ.కోట్లు కాజేసిన మాజీ రంజీ ప్లేయర్ ఆంధ్రప్రదేశ్
    మేనిఫెస్టోలోని 98.6శాతం హామీలను నెరవేర్చాం: అసెంబ్లీలో సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025