NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Cabinet: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
    తదుపరి వార్తా కథనం
    AP Cabinet: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
    సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ

    AP Cabinet: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 17, 2025
    02:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

    ధాన్యం సేకరణకు రూ.700 కోట్ల రుణం కోసం ఏపీ మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వ హామీని కేబినెట్‌ ఆమోదించింది.

    గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ వ్యవస్థపై చర్చ జరగడంతోపాటు, రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి సంబంధించిన ప్రతిపాదనలపై చర్చ జరిగింది.

    62 నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

    ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు విద్యుత్ డ్యూటీ టారిఫ్ తగ్గింపునకు ఆమోదం లభించింది.

    వివరాలు 

    అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ

    నాగావళి నదిపై గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజు కుడి, ఎడమ వైపుల మినీ హైడల్ ప్రాజెక్టుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది.

    కడప జిల్లా సీకే దిన్నె మండలంలో ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ ఇన్ఫ్రా కార్పొరేషన్‌కు కేటాయించిన 2,595 ఎకరాల బదిలీకి స్టాంపు డ్యూటీ మినహాయింపునకు కేబినెట్‌ అనుమతించింది.

    అలాగే, అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ ప్రతిపాదనపై కూడా చర్చ జరిగింది.

    ప్రస్తుతం కేబినెట్‌ సమావేశం కొనసాగుతుండగా, తీసుకున్న నిర్ణయాలను త్వరలో పూర్తిస్థాయిలో వెల్లడించనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఆంధ్రప్రదేశ్

    Vijayanand: ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ గా విజయానంద్‌ భారతదేశం
    Andhra Pradesh: గోదావరి - బనకచర్ల అనుసంధానం.. 3 నెలల్లో టెండర్లు పిలవాలని నిర్ణయం భారతదేశం
    Vijaya Ghee: ఆలయాల్లో 'విజయ' నెయ్యి తప్పనిసరి భారతదేశం
    CM Chandrababu:గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు కీలక ప్రకటన చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025