NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / టీటీడీ బోర్డు కొత్త సారథిగా భూమన కరుణాకర్‌ రెడ్డి నియమాకం
    తదుపరి వార్తా కథనం
    టీటీడీ బోర్డు కొత్త సారథిగా భూమన కరుణాకర్‌ రెడ్డి నియమాకం
    టీటీడీ బోర్డు కొత్త సారథిగా భూమన కరుణాకర్‌ రెడ్డి నియమాకం

    టీటీడీ బోర్డు కొత్త సారథిగా భూమన కరుణాకర్‌ రెడ్డి నియమాకం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 05, 2023
    05:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి నూతన ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ ఎంపిక చేశారు. ప్రస్తుత బోర్డు పదవీకాలం ఆగస్ట్ 8తో పూర్తి కానుంది.

    తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి గతంలోనూ టీటీడీ ఛైర్మన్ గా పని చేశారు. 2006 నుంచి 2008 మధ్య కాలంలో బోర్డు ఛైర్మన్‌గా పదవిలో కొనసాగారు.

    సీఎం జగన్ కుటుంబానికి అత్యంత ఆప్తులుగా భూమన గుర్తింపు పొందారు. రానున్న ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు జగన్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

    ఇదే సమయంలో టీటీడీ చైర్మన్‌గా పనిచేసి విశ్రాంతి తీసుకుంటానని కోరినట్లు సమాచారం.తిరుపతిలో తనకు బదులుగా కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని భూమన కోరుకుంటున్నారు.

    DETAILS

    ఇక పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వైవీ సుబ్బారెడ్డి

    ప్రపంచంలోనే ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే వెంకటేశ్వర స్వామి సన్నిధిని నడిపించే బోర్డుకు చైర్మన్ అంటే మంత్రి పదవి కంటే ఎక్కువగా ఆరాధిస్తారు. ఈ కోసం తీవ్రమైన పోటీ ఉంటుంది. అయితే ఛైర్మన్ పదవి తుది రేసులో ముగ్గురు బరిలోకి దిగారు.

    చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జంగా కృష్ణ‌మూర్తి, భూమన కరుణాకర్ రెడ్డి పోటీలో నిలిచారు. వీరిలో సీఎం జగన్ భూమనకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.గత ఎన్నికల్లో లోక్ సభ టిక్కెట్ ఆశించి భంగపడ్డ వైవీ సుబ్బారెడ్డిని బుజ్జగించేందుకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. తర్వాత పదవి కాలం పొడిగించడంతో 4 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు.

    వైవీ పూర్తి స్థాయిలో రాజకీయ వ్యవహారాలపై దృష్టిపెట్టేందుకు వైసీపీ అధిష్టానం ప్లాన్ రెఢీ చేస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    టీటీడీ
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్‌లో గంజాయిని అరికట్టాలంటూ గవర్నర్‌కు లోకేశ్ ఫిర్యాదు నారా లోకేశ్
    ఏపీలో కబ్జాలపాలైన అటవీభూములను రక్షించాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ చంద్రబాబు నాయుడు
    రానున్న రెండు రోజుల్లో ఏపీలో వర్షాలు.. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు భారీ వర్షాలు
    CI Anju Yadav: మరో వివాదంలో శ్రీకాళహస్తి సీఐ; తొడకొడుతూ హల్‌చల్ చేసిన అంజు యాదవ్‌ శ్రీకాళహస్తి

    టీటీడీ

    టీటీడీ కొత్త ఛైర్మన్ గా జంగా కృష్ణమూర్తి.. పార్టీ విధేయుడి పేరు పరిశీలిస్తున్నసీఎం జగన్ తిరుమల తిరుపతి

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలని కోరిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాపం సర్వేలదేనా? అవే జగన్‌ను తప్పుదారి పట్టించాయా? ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్: జగనన్న గోరుముద్దలో రాగి జావ; విద్యార్థుల మేథో వికాసంపై ప్రభుత్వం ఫోకస్ ఆంధ్రప్రదేశ్
    Andhra pradesh: ఉత్కంఠగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; ఓటేసిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025