NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు ఒంటిపూట బడులు 
    తదుపరి వార్తా కథనం
    ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు ఒంటిపూట బడులు 
    ఏపీ విద్యార్థులకు ఒంటిపూట బడులు నడపటానికి ప్రభుత్వం కీలక నిర్ణయం

    ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు ఒంటిపూట బడులు 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 14, 2023
    05:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జూన్ 15 సమీపిస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా వేసవికాలమే తాండవిస్తోంది. ఓ వైపు తీవ్రత ఉష్ణోగ్రతలు, వడగాలుల దృష్ట్యా పిల్లలకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    ఏపీలో జూన్ 12 నుంచి పాఠశాలల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పాఠశాల విద్యార్థులకు బడిగంట మోగుతోంది. ఆటలు మాయమై పుస్తకాలతో బీజీ బీజీగా గడిపేస్తున్నారు.

    మరోవైపు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఏపీ సర్కార్ స్కూళ్ల నిర్వహణపై పనఃసమీక్షించింది. ఈ మేరకు జూన్ 17 వరకు ఒక్క పూట బడులు మాత్రమే నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

    DETAILS

    ఉదయం 7.30 గంటల నుంచి 11:30 గంటల వరకే క్లాసులు

    అధిక ఎండ వేడి, వడగాలుల నేపథ్యంలో ఉదయం 7.30 గంటల నుంచి 11:30 గంటల వరకు మాత్రమే క్లాసులు నిర్వహించాలని ఆదేశించింది.

    వడ గాలుల తీవ్రత నేపథ్యంలోనే స్కూల్స్ రీ ఓపెన్ డేట్ వాయిదా వేయాలని ప్రతిపక్షాలు, తల్లిదండ్రుల సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి.

    అయితే ఆయా ప్రతిపాదనలను తొసిపుచ్చిన ప్రభుత్వం, అధికారులతో చర్చల అనంతరం ఒక్క పూట బడులు నిర్వహించేందుకే మొగ్గు చూపడం విశేషం.

    ఈ నేపథ్యంలోనే ఒంటి పూట క్లాసుల నిర్వహణను సమర్థిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,600 స్టాక్ మార్కెట్
    Flood Situation: ఈశాన్యంలో ప్రకృతి ప్రళయం.. వరదల బీభత్సంతో 43 మంది మృతి వరదలు
    Cash Row: జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై అభిశంసనకు కేంద్రం రంగం సిద్ధం  కేంద్ర ప్రభుత్వం
    Andhra Pradesh: ఏపీలో నేషనల్ హైవే ఆరు లైన్లుగా.. కేంద్రం ముందుకు ప్రతిపాదనలు శ్రీకాకుళం

    ఆంధ్రప్రదేశ్

    వైఎస్‌ అవినాష్‌రెడ్డికి భారీ ఊరట; ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు  హైకోర్టు
    ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రిచెస్ట్ ఉమెన్! ఎవరీ మహిమా దాట్ల? తెలంగాణ
    2025 నాటికి పోలవరాన్ని పూర్తి చేయండి; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం గడువు  పోలవరం
    దిల్లీలో అమిత్ షాను కలిసిన చంద్రబాబు- వచ్చేవారం ఏపీకి బీజేపీ అగ్రనేతలు; పొత్తు  కొసమేనా?  తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025