NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra pradesh: ఆంధ్రప్రదేశ్'లో సంక్షేమ పథకాలు అమలుపై ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్న ప్రభుత్వం..
    తదుపరి వార్తా కథనం
    Andhra pradesh: ఆంధ్రప్రదేశ్'లో సంక్షేమ పథకాలు అమలుపై ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్న ప్రభుత్వం..
    ఆంధ్రప్రదేశ్'లో సంక్షేమ పథకాలు అమలుపై ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్న ప్రభుత్వం..

    Andhra pradesh: ఆంధ్రప్రదేశ్'లో సంక్షేమ పథకాలు అమలుపై ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్న ప్రభుత్వం..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 07, 2025
    01:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు,మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల అమలుపై పూర్తిగా దృష్టి సారించింది.

    వాటిని ఒకొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. అయితే, ఈ సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రజల్లో నిజంగా సంతృప్తి ఉందా? లేదంటే ఎక్కడైనా అసంతృప్తి ఉందా? అనే కోణాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.

    ఈ ఉద్దేశంతోనే, ప్రస్తుతం అమలవుతోన్న వివిధ పథకాలపై ప్రజల నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలను (ఫీడ్‌బ్యాక్) సేకరిస్తోంది.

    ఈ ఫీడ్‌బ్యాక్ ప్రక్రియలో ప్రభుత్వం ఎదుర్కొన్న కొన్ని అంశాలు ఆశ్చర్యానికి గురిచేశాయి.

    ముఖ్యంగా సామాజిక పెన్షన్లు, ఆరోగ్య సేవలు, రెవెన్యూ శాఖ సేవలు, పోలీసు వ్యవస్థ వంటి రంగాల్లో తీసుకున్న అభిప్రాయాల్లో కొన్ని షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.

    వివరాలు 

    రియల్ టైమ్‌లో మానిటరింగ్

    ఉదాహరణకు, సామాజిక పెన్షన్ల విషయంలో కొందరు లంచం డిమాండ్ చేస్తున్నారని ఫీడ్‌బ్యాక్ ద్వారా అధికారులకు తెలియజేయబడింది.

    అదే విధంగా, మాదక ద్రవ్యాల నియంత్రణ విషయంలో పోలీస్ వ్యవస్థ సరైన విధంగా పని చేయడం లేదని కూడా ప్రజలు అభిప్రాయపడ్డారు.

    ఈ నేపథ్యంలో, ఉద్యోగుల పనితీరును సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ప్రభుత్వం కొత్త వ్యవస్థను రూపొందించడానికి సిద్ధమవుతోంది.

    అధికారులు, ఉద్యోగుల పనితీరు తక్షణంగా (రియల్ టైమ్‌లో) మానిటరింగ్ అయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనుంది.

    అందులో భాగంగా, ప్రజలకు సేవలందించడంలో ఎవరు ఎంతగా ముందున్నారు? వారి పనితీరు ఎలా ఉంది? అనే అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది ప్రభుత్వం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్

    Andhra Pradesh: ఐదేళ్లలో తొలిసారి విద్యుత్ ఛార్జీలలో తగ్గింపు.. ట్రూడౌన్‌ ప్రకటన! విద్యుత్
    AP cabinet: చేనేత, పవర్ లూమ్ రంగాలకు ఉచిత విద్యుత్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! చంద్రబాబు నాయుడు
    Andhra News:  ఎస్సీ వర్గీకరణ నివేదికకు మంత్రి వర్గం ఆమోదం  భారతదేశం
    AP Liquor Scam: లిక్కర్ స్కాంలో విచారణ వేగవంతం.. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన వైసీపీ మాజీ ఎంపీ వైసీపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025