NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ration Cards: ఏపీలో త్వరలో కొత్త రేషన్‌ కార్డులు.. త్వరలో మంత్రివర్గ భేటీలో నిర్ణయం
    తదుపరి వార్తా కథనం
    Ration Cards: ఏపీలో త్వరలో కొత్త రేషన్‌ కార్డులు.. త్వరలో మంత్రివర్గ భేటీలో నిర్ణయం
    ఏపీలో త్వరలో కొత్త రేషన్‌ కార్డులు.. త్వరలో మంత్రివర్గ భేటీలో నిర్ణయం

    Ration Cards: ఏపీలో త్వరలో కొత్త రేషన్‌ కార్డులు.. త్వరలో మంత్రివర్గ భేటీలో నిర్ణయం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 09, 2024
    11:01 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అర్హత ఉన్న పేదలకు త్వరలో కొత్త రేషన్ కార్డులు అందించేందుకు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల మార్పులు, చేర్పులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

    వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వ వంద రోజుల పాలన సందర్భంగా కొత్తగా రేషన్ కార్డుల జారీ, పౌర సరఫరాల శాఖలో ఇతర సమస్యల పరిష్కారం ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

    ఈ క్రమంలో,వైసీపీ ప్రభుత్వం చెల్లించకుండాపెండింగ్‌లో ఉన్న ధాన్యం బకాయిలు రూ.1,674.40 కోట్ల మొత్తాన్ని ఎన్డీయే ప్రభుత్వం చెల్లించింది.

    ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి దశలో రూ. 1,000 కోట్లు, తరువాత రెండవ దశలో రూ. 674.40 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది.

    వివరాలు 

    రేషన్ వాహనాలపై త్వరలో నిర్ణయం

    రేషన్ సరుకుల పంపిణీ కోసం వాహనాల వినియోగంపై ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది.

    మంత్రివర్గసమావేశంలో దీనిపై చర్చించనున్నారు.6వేల రేషన్ డీలర్ల ఖాళీలను భర్తీ చేయడంతో పాటు కొత్తగా 4వేలకు పైగా దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు.

    నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో రూ.10 వేల,పట్టణ ప్రాంతాలలో రూ.12 వేలను మించితే,ఆ కుటుంబాలు రేషన్ కార్డుకు అర్హులు కాదని గత ప్రభుత్వం నిర్ణయించింది.

    ఈ కారణంగా,అంగన్‌వాడీ కార్యకర్తలు,పొరుగు సేవల ఉద్యోగుల కార్డులు రద్దు చేయబడ్డాయి.

    వారి కుటుంబాలు ప్రభుత్వపథకాలకు దూరమయ్యాయి.తాము పొందే జీతం తక్కువగా ఉందని, రేషన్ కార్డుల తొలగింపు వల్ల వారు నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    ఈప్రభుత్వం కుటుంబ ఆదాయ పరిమితిని పెంచి,కొత్తగా కార్డులు జారీ చేయాలని వారు కోరుకుంటున్నారు.

    వివరాలు 

    ఏం చేయబోతున్నారు? 

    కొత్త రేషన్‌ కార్డుల మంజూరు

    కుటుంబాల విభజన

    కుటుంబ సభ్యుల చేర్పు

    కుటుంబ సభ్యుల తొలగింపు

    చిరునామా మార్పు

    కార్డులను సరెండర్‌ చేయడం

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Thug Life: అడ్వాన్స్ బుకింగ్ లో దుమ్మురేపిన కమల్ హాసన్ 'థగ్ లైఫ్'.. Rs.14 కోట్ల కలెక్షన్లతో రికార్డు   కమల్ హాసన్
    2025 Yezdi Adventure:సరికొత్త 2025 యెజ్డి అడ్వెంచర్ లాంచ్.. ధర ఎంతంటే?  ఆటో మొబైల్
    World Environment Day 2025: నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ప్లాస్టిక్ కాలుష్యాన్ని జయిద్దాం అనే థీమ్‌తో వేడుకలు ముఖ్యమైన తేదీలు
    11 years of NDA: ఎన్డీయే ప్రభుత్వానికి నిన్నటితో 11 ఏళ్లు.. ఆసక్తికర పోస్ట్ చేసిన మోదీ  నరేంద్ర మోదీ

    ఆంధ్రప్రదేశ్

    AP Tet: ఈనెల 22 నుంచి ఏపీ టెట్‌ హాల్‌ టికెట్లు.. అక్టోబర్‌ 3 నుంచి పరీక్షల నిర్వహణ  భారతదేశం
    IPS: తెలుగు రాష్ట్రాలకు యువ ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయిస్తూ ఉత్తర్వులు తెలంగాణ
    Ap Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అన్ని రకాల బ్రాండ్లు కేవలం రూ. 99కే భారతదేశం
    Andhrapadesh: రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం.. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025