Kodikathi Sreenu: కోడి కత్తి కేసులో శ్రీనివాస్ కు బెయిల్
కోడి కత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ కు ఏటికేలకు ఆంధ్రప్రదేశ్ హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈకేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించింది. షరతులతో కూడిన బెయిల్లో భాగంగా ర్యాలీలు,బహిరంగ సభల్లో పాల్గొనకూడదని ఆదేశించింది. 2018 అక్టోబర్ 25న విశాఖ ఎయిర్ పోర్టులో సీఎం జగన్ పై కోడి కత్తితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. బెయిల్ కోసం శ్రీను, అతని తల్లి నిరవధిక నిరాహార దీక్షలో పాల్గొన్నారు. నిందితుడు శ్రీనుకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో వారి ప్రయత్నాలు ఫలించాయి. శ్రీను గతంలో 7సార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ వాటన్నింటినీ ఆయా కోర్టులు తిరస్కరించడంతో ఏపీ హైకోర్టు ఈరోజు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.