LOADING...
Andhra news: తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు 
తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

Andhra news: తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 10, 2025
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చట్టప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవడానికి సీఐడీ, ఏసీబీ డీజీలకు హైకోర్టు వెసులుబాటు కల్పించింది. పరకామణి కేసులో లోక్ అదాలత్‌లో రాజీ వ్యవహారం ఉన్న సందర్భంలో, నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తును కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చింది. కేసు సంబంధిత సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని సీఐడీ, ఏసీబీ డీజీలకు సూచించింది.

వివరాలు 

ఈ నెల 16 వరకు వాయిదా

అంతేకాక, మాజీ ఏవీఎస్‌వో సతీష్ శవపరీక్ష నివేదికను సీల్డ్ కవర్‌లో రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు సమర్పించాలని హైకోర్ట్ సీఐడీకి ఆదేశించింది. కేసు దర్యాప్తులో భాగంగా, ఐటీ, ఈడీతో సమాచారం పంచుకోవాల్సిందని కూడా స్పష్టంచేసింది. సీఐడీ, ఏసీబీ డీజీల ఇచ్చిన నివేదికలను పరిశీలించిన తరువాత హైకోర్టు ఈవిధంగా ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం ఈ నెల 16 వరకు వాయిదా వేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ

Advertisement