LOADING...
Vijayawada Metro: విజయవాడ మెట్రోకు టెండర్లు పిలిచిన ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్‌ 
విజయవాడ మెట్రోకు టెండర్లు పిలిచిన ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్‌

Vijayawada Metro: విజయవాడ మెట్రోకు టెండర్లు పిలిచిన ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 28, 2025
02:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ మెట్రోరైలు కార్పొరేషన్ కీలక ముందడుగు వేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లను ఈపీసీ (ఇంజినీరింగ్‌-ప్రొక్యూర్‌మెంట్‌-కన్స్ట్రక్షన్‌) విధానంలో ఆహ్వానించింది. మొదటి దశ (ఫేజ్‌-1)లో మొత్తం 38.4 కిలోమీటర్ల మేర రెండు కారిడార్లలో మెట్రో రైలు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా,కారిడార్-1 నెహ్రూ బస్టాండ్‌ నుంచి గన్నవరం బస్టాండ్‌ వరకు ఏర్పడనుంది.

వివరాలు 

మెట్రో రైలు మార్గంలో మొత్తం 32 స్టేషన్ల ఏర్పాటు

ఇక కారిడార్-2 బస్టేషన్‌ నుంచి పెనమలూరు వరకు సాగనుంది. కారిడార్-1లో 4.7 కిలోమీటర్ల పొడవున డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌ను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ మెట్రో రైలు మార్గంలో మొత్తం 32 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. అదనంగా, ఒక ప్రత్యేక ప్రాంతంలో భూగర్భ మెట్రో స్టేషన్‌ కూడా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, విశాఖపట్టణం మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లను ఇప్పటికే పిలిచిన సంగతి తెలిసిందే.