NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Srikakulam: బ్యాంకులో 7కేజీల బంగారం మాయం.. గోల్డ్ కస్టోడియన్ బ్యాంక్ మహిళా అధికారి ఆత్మహత్య 
    తదుపరి వార్తా కథనం
    Srikakulam: బ్యాంకులో 7కేజీల బంగారం మాయం.. గోల్డ్ కస్టోడియన్ బ్యాంక్ మహిళా అధికారి ఆత్మహత్య 
    గోల్డ్ కస్టోడియన్ బ్యాంక్ మహిళా అధికారి ఆత్మహత్య

    Srikakulam: బ్యాంకులో 7కేజీల బంగారం మాయం.. గోల్డ్ కస్టోడియన్ బ్యాంక్ మహిళా అధికారి ఆత్మహత్య 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 01, 2023
    12:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బ్యాంకుల్లో ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారం మాయమైంది. ఈ మధ్య తరచుగా ఇటువంటి ఉదంతాలు జరుగుతున్నాయి.

    తాజాగా శ్రీకాకుళం జిల్లా గారా ఎస్.బీ.ఐలో దాదాపుగా 7 కేజీల బంగారం చోరీకి గురైంది.

    ఈ వ్యవహారాలను పర్యవేక్షించే బ్యాంకు మహిళా అధికారి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది.

    ఖాతాదారులు, తమ రుణాలను తీర్చేసినా వాళ్ల బంగారం ఇంకా అందలేదు. ఈ మేరకు బ్యాంకులో ఉన్న పసిడి అంతా ఎవరో దోచేశారు.

    తమ బంగారం ఇచ్చేయాలని గత కొద్ది రోజులుగా ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి ఆందోళన చేస్తున్నారు.

    ఈ మేరకు ఆరా తీసిన బ్యాంక్ అధికారులు 7 కిలోల వరకు బంగారం మాయమైనట్లు గుర్తించి విస్మయానికి గురయ్యారు.

    Details

     ఆడిట్ కారణంగానే జాఫ్యం

    ఈ క్రమంలోనే గోల్డ్ కస్టోడియన్ విధుల్లో ఉన్న మహిళా ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడ్డారు.

    చోరీకి గురైన బంగారం విలువ దాదాపు రూ.4 కోట్లగా ఉంటుందని అంచనా. సదరు ఖాతాదారులు రుణాలు, బకాయిలు తీర్చేసుకున్నా వారికి బంగారం వెనక్కి ఇవ్వలేదు. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు.

    బంగారం చోరీ ఇంటి దొంగల పనే అన్న అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు అందింది.

    అయితే విచారణకు ముందే బ్యాంకులో పని చేస్తున్న మహిళా అధికారిణి బలవన్మరణానికి పాల్పడటం కలకలం సృష్టించింది.

    మరోవైపు శ్రీకాకుళం రీజనల్ మేనేజర్, ఆడిట్ కారణంగానే జాప్యం జరుగుతోందని, వదంతులు నమ్మొద్దని బాధితులకు సర్దిచెప్పారు.

    డిసెంబర్ 8 వరకు వేచి ఉండాలని,ఈలోగా బంగారం అప్పగిస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.

    DETAILS

    బంగారం కోసం ఖాతాదారుల ఆందోళన

    బ్యాంకులో ఆడిట్ జరుగుతున్న సందర్బంగా గోల్డ్ లోన్స్ బాధ్యతలు చూసే 39ఏళ్ల డిప్యూటీ మేనేజర్ స్వప్నప్రియ నవంబర్ 29న ఆత్మహత్యకు పాల్పడ్డారు.

    బంగారం పక్కదారి పట్టడంతోనే ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడ్డారనే అనుమానాలున్నాయి.

    బంగారం మాయం వ్యవహారంలో ఉద్యోగుల ప్రమేయంపై ప్రచారం విస్తృతమైంది.దీంతో మరోసారి ఖాతాదారులు బ్యాంకు ముందు ఆందోళనకు దిగారు.

    నగలు మాయమైన సంగతి అంతర్గత విచారణలో వెల్లడైనా, అధికారులు విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

    బంగారం గల్లంతు వ్యవహారంలో స్వప్నప్రియను బాధ్యురాలిని చేస్తూ,నవంబర్ 20 నుంచి సెలవుపై పంపారు ఉన్నతాధికారులు. ఈ క్రమంలో రెండుసార్లు విచారణకు పిలిపించారు.

    డిసెంబర్ 8న ఖాతాదారులకు కచ్చితంగా బంగారం అప్పగిస్తామని అధికారులు స్పష్టం చేశారు.ఈలోపే మహిళా ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడడంతో గురువారం పోలీసులను ఆశ్రయించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    శ్రీకాకుళం

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్

    Visakhapatnam money seize: వాషింగ్ మెషిన్లో 1.30 కోట్లు.. షాకైన పోలీసులు! విశాఖపట్టణం
    చంద్రబాబు సంచలన లేఖ.. తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందని ఏసీబీ జడ్జికి లెటర్ చంద్రబాబు నాయుడు
    Regional Passport Office: విజయవాడలో ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ఏర్పాటు.. జనవరిలో ప్రారంభం విజయవాడ సెంట్రల్
    Two Trains Collide: విజయనగరంలో రెండు రైళ్లు ఢీ.. ఆరుగురు మృతి రైలు ప్రమాదం

    శ్రీకాకుళం

    ముంచుకొస్తున్న తుఫాను, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఆంధ్రప్రదేశ్
    ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే? ఎమ్మెల్సీ
    'ఓటర్లను ఏ, బీ, సీలుగా విభజించండి, వారితో ఒట్టు వేయించుకోండి'; ధర్మాన వ్యాఖ్యలు వైరల్ ధర్మాన ప్రసాద రావు
    శ్రీకాకుళంలో బహుదా నదిపై కుప్పకూలిన బ్రిటిష్ కాలం నాటి వంతెన  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025