NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amaravati: రాజధాని అమరావతిలో మరో రూ.8,821.14 కోట్ల పనులకు సీఆర్డీయే అథారిటీ ఆమోదం
    తదుపరి వార్తా కథనం
    Amaravati: రాజధాని అమరావతిలో మరో రూ.8,821.14 కోట్ల పనులకు సీఆర్డీయే అథారిటీ ఆమోదం
    రాజధాని అమరావతిలో మరో రూ.8,821.14 కోట్ల పనులకు సీఆర్డీయే అథారిటీ ఆమోదం

    Amaravati: రాజధాని అమరావతిలో మరో రూ.8,821.14 కోట్ల పనులకు సీఆర్డీయే అథారిటీ ఆమోదం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 11, 2024
    08:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో ₹8,821.14 కోట్ల విలువైన పనులకు సీఆర్డీయే అథారిటీ ఆమోదం ఇచ్చింది.

    మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 42వ అథారిటీ సమావేశంలో 20 పనులకు అనుమతి లభించింది.

    గత 41వ సమావేశంలో ₹11,467.27 కోట్ల పనులకు ఆమోదం ఇవ్వగా, ఇప్పటివరకు మొత్తం ₹20,288.41 కోట్ల పనులకు ఆమోదం జరిగింది.

    ఈ నెలాఖరుకల్లా 99.9% పనులకు టెండర్లు పిలుస్తామని పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు.

    తొలివిడతకు సంబంధించిన పనుల కోసం నాలుగైదు రోజుల్లో టెండర్ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని, తాజా ఆమోదం పొందిన పనులకు మంత్రివర్గ ఆమోదం తర్వాత టెండర్లు పిలుస్తామని తెలిపారు.

    వివరాలు 

    45% పెరిగిన నిర్మాణ వ్యయం 

    ఈ సమావేశంలో ₹4,521.11 కోట్లతో ప్రధాన రహదారుల నిర్మాణానికి,₹3,807.73 కోట్లతో భూములిచ్చిన రైతులకు కేటాయించిన లేఅవుట్ల అభివృద్ధికి,₹492.30 కోట్లతో మంత్రులు,హైకోర్టు న్యాయమూర్తుల నివాస భవనాల నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు.

    1200-1500కిలోమీటర్ల రహదారులలో ప్రస్తుతానికి 236కిలోమీటర్లకు అనుమతి లభించగా,360 కిలోమీటర్ల ప్రధాన రహదారుల నిర్మాణంలో 97.5 కిలోమీటర్ల పనులు 14ప్యాకేజీలుగా చేపట్టనున్నట్లు వెల్లడించారు.

    మొత్తం నిర్మాణ వ్యయం 45% పెరిగిందని,2019కి ముందు అంచనా వేసిన ₹41 వేల కోట్ల బడ్జెట్ ప్రస్తుతం ₹60 వేల కోట్లకు చేరిందని నారాయణ పేర్కొన్నారు.

    వైసీపీ ప్రభుత్వం పనులు నిలిపివేయడం వల్ల వ్యయాలు పెరిగాయని,కొనసాగిస్తే వ్యయం 25-45% తగ్గేదని అన్నారు.

    స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్ సంస్థలతో మళ్లీ చర్చలు చేయడం ముఖ్యమంత్రి నిర్ణయంపై ఆధారపడి ఉందని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమరావతి

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    అమరావతి

    అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే మైలవరం
    అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌‌లో చల్లచల్లగా; రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు  ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట; చంద్రబాబు పాలనలో నిర్ణయాలపై విచారణకు లైన్ క్లియర్  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025