NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pollution: హైదరాబాద్‌ నగరంలో పెరిగిన వాయు కాలుష్యం.. టీజీఎస్‌పీసీబీ హెచ్చరిక 
    తదుపరి వార్తా కథనం
    Pollution: హైదరాబాద్‌ నగరంలో పెరిగిన వాయు కాలుష్యం.. టీజీఎస్‌పీసీబీ హెచ్చరిక 
    హైదరాబాద్‌ నగరంలో పెరిగిన వాయు కాలుష్యం.. టీజీఎస్‌పీసీబీ హెచ్చరిక

    Pollution: హైదరాబాద్‌ నగరంలో పెరిగిన వాయు కాలుష్యం.. టీజీఎస్‌పీసీబీ హెచ్చరిక 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 26, 2025
    09:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్‌ నగరంలో వాయు కాలుష్యం పెరిగిపోతుండటంతో ఇది తీవ్రమైన సమస్యగా మారుతోంది.

    విద్యుత్తు కోతల కారణంగా జనరేటర్ల వినియోగం అధికమవుతున్నదని,దీంతో వాయు నాణ్యత మరింతగా క్షీణిస్తున్నదని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు హెచ్చరిస్తున్నారు.

    ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్య స్థాయిలు ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో, హైదరాబాద్‌లోనూ ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.

    ముఖ్యంగా సనత్‌నగర్‌ ప్రాంతంలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకున్నది.

    సోమవారం మధ్యాహ్నం 431ఏక్యూఐ నమోదు అయినట్లు తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు తెలిపారు.

    ఇక నగర వ్యాప్తంగా సగటు 108 ఏక్యూఐగా నమోదైందని,జూపార్‌లో 135,పటాన్‌ చెరువులో 112 ఏక్యూఐ ఉన్నప్పటికీ గ్రేటర్‌ పరిధిలో గాలి నాణ్యతను సూచించే 14స్టేషన్లలో ఎక్కడా 100ఏక్యూఐ దాటలేదని వివరించారు.

    వివరాలు 

    సనత్‌నగర్‌లో కాలుష్యం ఎక్కువగా ఎందుకు? 

    సనత్‌నగర్‌ ఒక ఇండస్ట్రియల్‌ ప్రాంతం కావడంతో అక్కడ సహజంగానే గాలి నాణ్యత తక్కువగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

    గతంలో నవంబర్‌ 25న 298, డిసెంబర్‌లో 229,జనవరిలో 171 ఏక్యూఐ నమోదైనప్పటికీ,సోమవారం ఏకంగా 431 ఏక్యూఐ చేరుకోవడం ఆందోళన కలిగిస్తున్నదని తెలిపారు.

    సనత్‌నగర్‌లో ఎయిర్‌ క్వాలిటీ పరీక్షించే మీటర్‌ సమీపంలో రెండు కంపెనీల జనరేటర్లు ఉన్నాయని, వాటి వల్లే గాలి నాణ్యత మరింత క్షీణించిన అవకాశముందని టీజీఎస్‌పీసీబీ సీనియర్‌ శాస్త్రవేత్త ప్రసాద్‌ తెలిపారు.

    గాలి ప్రవాహం పెరిగినప్పుడు కాలుష్య స్థాయిలు తగ్గే అవకాశం ఉందని, సోమవారం నమోదైన 431 ఏక్యూఐ జనరేటర్ల ప్రభావం వల్లే కావచ్చని, దీనికి అధికంగా భయపడాల్సిన అవసరం లేదని ఆయన వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    వాయు కాలుష్యం

    తాజా

    Pawan Kalyan: హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముహూర్తం ఖరారు.. వేదిక ఎక్కడంటే? పవన్ కళ్యాణ్
    Russia-Ukraine Conflict: ఫలితమివ్వని రష్యా, ఉక్రెయిన్‌ చర్చలు.. యుద్ధ ఖైదీల మార్పిడికే పరిమితం ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Andhra News: రాజధాని నుంచి రాయలసీమకు యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించేందుకు ప్రణాళిక అమరావతి
    Pakistan: పాక్‌లో కలకలం.. మాలిర్ జైలు నుంచి 200 మంది ఖైదీలు పరార్ పాకిస్థాన్

    హైదరాబాద్

    Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీ.. అరుణాచల్‌ ప్రదేశ్‌ను చిత్తుచేసిన హైదరాబాద్ స్పోర్ట్స్
    Hyderabad: పాతబస్తీ మెట్రో భూసేకరణ.. 40 నిర్వాసితులకు పరిహార చెక్కులు అందజేత తెలంగాణ
    Allu Arjun: పోలీసుల అనుమతితో నేడు కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ అల్లు అర్జున్
    Hyderabad: గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్తు వినియోగం రికార్డు స్థాయికి ఇండియా

    వాయు కాలుష్యం

    గ్రీన్ హైదరాబాద్: ఫ్లై ఓవర్ల కింద ఆక్సిజన్ పార్కుల ఏర్పాటు హైదరాబాద్
    దిల్లీలో దయనీయంగా గాలి నాణ్యత.. లాక్‌డౌన్ దిశగా దేశ రాజధాని  దిల్లీ
    Delhi AQI 500: దిల్లీలో తీవ్రంగా క్షీణించినట్లు గాలి నాణ్యత.. కాలుష్యం కట్టడికి ప్రత్యేక చర్యలు దిల్లీ
    Delhi Schools Closed: దిల్లీలో పీక్‌లో వాయి కాలుష్యం.. నవంబర్ 10 వరకు ప్రైమరీ స్కూళ్ల మూసివేత దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025