NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మణిపూర్ లో మళ్లీ హింసాత్మకం.. బాష్పవాయువును ప్రయోగించిన పోలీసులు
    తదుపరి వార్తా కథనం
    మణిపూర్ లో మళ్లీ హింసాత్మకం.. బాష్పవాయువును ప్రయోగించిన పోలీసులు
    అట్టుడుకుతున్న మణిపూర్.. టియర్ గ్యాస్ ను ప్రయోగించిన పోలీసులు

    మణిపూర్ లో మళ్లీ హింసాత్మకం.. బాష్పవాయువును ప్రయోగించిన పోలీసులు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 30, 2023
    11:33 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మణిపూర్‌ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా మరోసారి అలర్లు చెలరేగడం కలకలం సృష్టిస్తోంది.

    గత కొద్ది రోజులుగా రెండు తెగల మధ్య చెలరేగిన ఘర్షణలు రోజురోజుకీ ముదురుతున్నాయి.

    హింసాత్మకమైన ఘటనలు ఇప్పటికీ కొనసాగుతుండటం ఆందోళన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు క్రమంగా క్షీణిస్తున్నాయి.

    కాంగ్‌పోక్పి జిల్లా హరోథెల్ గ్రామంలో గురువారం అల్లర్లు జరిగాయి. వీటిని ఆపేందుకు పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించాడు. గురువారం అతని మృతదేహాన్ని ఇంఫాల్ కు తరలించారు.

    సమాచారం బయటకి పొక్కడంతో నివాళులు అర్పించేందుకు వచ్చిన జనం, మృతదేహాన్ని శవపేటికలో ఉంచి ఇంఫాల్ నడిబొడ్డున ఖ్వైరాంబండ్ బజార్ కు తరలించారు.

    details

    అల్లర్లతో అట్టుడికిపోతున్న ఈశాన్య రాష్ట్ర మణిపూర్ 

    అక్కడ కొందరు నిరసనకారులు సదరు శవపేటికను ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నివాసానికి ఊరేగింపుగా మోసుకెళ్తామన్నారు.

    అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి రోడ్ల మధ్యలో టైర్లను కాల్చడంతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) రంగంలోకి దిగి టియర్ గ్యాస్ ను ప్రయోగించింది.

    పరిస్థితిని అదుపు చేసేందుకు మృత దేహాన్ని నెహ్రూ మెడికల్ కాలేజీలోని మార్చురీకి తరలించారు. మణిపూర్‌ ప్రభుత్వం ఇటీవలే మైతీలకు ఎస్టీ హోదా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని కుకీ వర్గం తీవ్రంగా ఖండించింది.

    ఈ నేపథ్యంలోనే మే 3న మైతీ, కుకీ వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు నేటికీ కొనసాగుతూన్నాయి. అల్లర్లు, హింసాత్మక ఘటనల్లో సుమారు 120 మందికిపైగా జనం మరణించగా, 350 మందికి పైగా గాయపడ్డారు. 50 వేల మందికిపైగా ఆశ్రయం కోల్పోయారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మణిపూర్
    ప్రభుత్వం

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    మణిపూర్

    మణిపూర్‌లో ఉద్రిక్తత: సీఎం కార్యక్రమ వేదికకు నిప్పు; 144 సెక్షన్ విధింపు  తాజా వార్తలు
    మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత; రాష్ట్రం ఎందుకు రావణకాష్టమైంది? ఈ హింస వెనకాల ఉన్న దశాబ్దాల కథేంటి? ఆర్మీ
    మణిపూర్‌లో 'నీట్ యూజీ 2023' పరీక్ష వాయిదా  తాజా వార్తలు
    మణిపూర్‌లో 23,000మందిని రక్షించిన సైన్యం; చురచంద్‌పూర్‌లో పాక్షికంగా కర్ఫ్యూ సడలింపు  తాజా వార్తలు

    ప్రభుత్వం

    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ బీజేపీ
    ఆంధ్రప్రదేశ్‌కు రూ.10వేల కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం ఆంధ్రప్రదేశ్
    వడగళ్ల వాన పడినా గింజ రాలదు.. పంట స్థిరంగా ఉంటుంది తెలంగాణ
    గోదావరి జలాలు కావేరికి.. మొగ్గు చూపుతున్న కేంద్రం తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025