NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మణిపూర్‌లో 23,000మందిని రక్షించిన సైన్యం; చురచంద్‌పూర్‌లో పాక్షికంగా కర్ఫ్యూ సడలింపు 
    తదుపరి వార్తా కథనం
    మణిపూర్‌లో 23,000మందిని రక్షించిన సైన్యం; చురచంద్‌పూర్‌లో పాక్షికంగా కర్ఫ్యూ సడలింపు 
    మణిపూర్‌లో 23,000మందిని రక్షించిన సైన్యం; చురచంద్‌పూర్‌లో పాక్షికంగా కర్ఫ్యూ సడలింపు

    మణిపూర్‌లో 23,000మందిని రక్షించిన సైన్యం; చురచంద్‌పూర్‌లో పాక్షికంగా కర్ఫ్యూ సడలింపు 

    వ్రాసిన వారు Stalin
    May 07, 2023
    01:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మణిపూర్‌లో హింస నేపథ్యంలో శాంతి భద్రతలను కాపాడేందుకు, పౌరులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైన్యం, అస్సాం రైఫిల్స్‌‌ను రంగంలోకి దింపింది.

    ఈ క్రమంలో హింస నుంచి ఆర్మీ, అస్సాం రైఫిల్స్‌‌ బలగాలు ఇప్పటివరకు దాదాపు 23,000 మంది పౌరులను విజయవంతంగా కాపాడినట్లు అధికారులు తెలిపారు.

    వారిని ప్రభుత్వ స్థావరాలకు పంపినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే, చురాచంద్‌పూర్‌లో ఆదివారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు కర్ఫ్యూను సడలించారు.

    అయితే ఆ సమయంలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగలేదని అధికారులు ప్రకటనలో వెల్లడించారు.

    అన్ని కమ్యూనిటీల్లోని పౌరులను రక్షించడానికి, హింసను అరికట్టడానికి, సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి గత 96 గంటలుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న 120-125 ఆర్మీ, అస్సాం రైఫిల్స్ దళాలు పని చేస్తున్నాయి.

    మణిపూర్

    ఇంఫాల్ లోయలో వైమానిక నిఘా 

    అంతకుముందు మే 3న చెలరేగిన హింస నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల కారణంగా మణిపూర్‌లోని హింసాత్మకమైన జిల్లా చురచంద్‌పూర్‌లో యంత్రాంగం పూర్తి కర్ఫ్యూ విధించింది.

    గత 24గంటల్లో సైన్యం ఇంఫాల్ లోయను వైమానిక నిఘాతో నిత్యం పర్యవేక్షిస్తోంది.

    భద్రతా బలగాల జోక్యంతో రాష్ట్రంలో పరిస్థితి మెరుగుపడిందని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పి డౌంగెల్ తెలిపారు. మణిపూర్‌లో ఆర్‌ఎఎఫ్, బిఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్‌తో సహా బలగాలను మోహరించినట్లు ఆయన చెప్పారు.

    సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) చీఫ్ కుల్దీప్ సింగ్‌ను భద్రతా సలహాదారుగా నియమించారు.

    మణిపూర్‌లో పరిస్థితిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఇంటెలిజెన్స్), అశుతోష్ సిన్హాను మొత్తం కార్యాచరణ కమాండర్‌గా నియమించినట్లు రాష్ట్ర డీజీపీ తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మణిపూర్
    ఆర్మీ
    తాజా వార్తలు

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    మణిపూర్

    మణిపూర్‌లో ఉద్రిక్తత: సీఎం కార్యక్రమ వేదికకు నిప్పు; 144 సెక్షన్ విధింపు  నోంగ్‌తోంబమ్ బీరెన్ సింగ్
    మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత; రాష్ట్రం ఎందుకు రావణకాష్టమైంది? ఈ హింస వెనకాల ఉన్న దశాబ్దాల కథేంటి? ఇంఫాల్
    మణిపూర్‌లో 'నీట్ యూజీ 2023' పరీక్ష వాయిదా  తాజా వార్తలు

    ఆర్మీ

    దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా? హిమాచల్ ప్రదేశ్
    అగ్నిపథ్ పథకాన్ని సమర్థించిన దిల్లీ హైకోర్టు; ఆ పిటిషన్లన్నీ కొట్టివేత దిల్లీ
    మా సైన్యాన్ని ఆధునీకరించడం వల్ల ఏ దేశానికీ ముప్పు ఉండదు: చైనా చైనా
    పాకిస్థాన్ కవ్విస్తే భారత్ ఊరుకోదు, తగిన సమాధానం చెబుతుంది: అమెరికా భారతదేశం

    తాజా వార్తలు

    కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారు; ఈ నెలఖరులోనే!  నరేంద్ర మోదీ
    దిల్లీలో భారీ వర్షాలు: 13ఏళ్లలో రెండో కూలెస్ట్ డేగా రికార్డు దిల్లీ
    దిల్లీ మద్యం పాలసీ కేసు: ఛార్జిషీట్‌లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేరును చేర్చిన ఈడీ  దిల్లీ
    కాళీ దేవతపై ఉక్రెయిన్ అనుచిత ట్వీట్; భారతీయులకు క్షమాపణలు చెప్పిన ఆ దేశ మంత్రి  ఉక్రెయిన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025