NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Arvind Kejriwal: ఆవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అరవింద్ కేజ్రీవాల్.. ఎందుకంటే! 
    తదుపరి వార్తా కథనం
    Arvind Kejriwal: ఆవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అరవింద్ కేజ్రీవాల్.. ఎందుకంటే! 
    ఆవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అరవింద్ కేజ్రీవాల్.. ఎందుకంటే!

    Arvind Kejriwal: ఆవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అరవింద్ కేజ్రీవాల్.. ఎందుకంటే! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 16, 2024
    05:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మొత్తం 70 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీకి 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

    మోషన్‌ను ప్రవేశపెడుతున్నప్పుడు, ఆప్ ఎమ్మెల్యేలు ఎవరూ విడిపోలేదని ప్రజలకు చూపించాలనుకుంటున్నట్లు కేజ్రీవాల్ అన్నారు.

    ఢిల్లీ అసెంబ్లీలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. "కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. తప్పుడు కేసులు బనాయించి ఇతర రాష్ట్రాల్లో పార్టీలను విచ్ఛిన్నం చేయడం, ప్రభుత్వాలను పడగొట్టడం మనం చూస్తున్నాం.

    మద్యం పాలసీ కేసు సాకుతో నాయకులను అరెస్ట్ చేయాలని వారు భావిస్తున్నారు. మా ఎమ్యెల్యేలు ఎవరూ విడిపోలేదని చెక్కుచెదరలేదని ప్రజలకు చూపించేందుకు నేను విశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నాను" అని తెలిపారు.

    Details 

    ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.25 కోట్లు ఆఫర్

    ఢిల్లీ ఎన్నికల్లో తాము ఎప్పటికీ గెలవలేమని వారికి తెలుసు కాబట్టి ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ భావిస్తోందని ఆయన ఆరోపించారు.

    శనివారం ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది.తన ప్రభుత్వాన్ని పడగొట్టే లక్ష్యంతో ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించిన వారాల తర్వాత కేజ్రీవాల్ ఈ చర్య తీసుకున్నారు.

    పార్టీ మారేందుకు ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.25 కోట్లు ఆఫర్ చేసిందని ఆయన పేర్కొన్నారు.

    లిక్కర్ పాలసీ కేసులో ఆయనను త్వరలో అరెస్ట్ చేస్తామని కూడా బీజేపీ బెదిరింపులకు పాల్పడుతోందన్నారు.

    అయన వాదనను అనుసరించి,ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ ఆరోపణలపై విచారణకు హాజరు అవ్వాలని అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసు పంపింది.

    Details 

    ఢిల్లీ ముఖ్యమంత్రికి ఆరోసారి సమన్లు 

    తనపై వచ్చిన ఆరోపణలను నిరూపించాలని పోలీసులు కోరారు.

    ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలను కొనుగోలుకు సంప్రదించిన వారి పేర్లను కూడా చెప్పాలని నోటీసులో ముఖ్యమంత్రిని కోరారు.

    లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టుకు హాజరు కావడానికి ఒక రోజు ముందు కేజ్రీవాల్ మోషన్‌ను ముందుకు తెస్తానని ప్రకటించారు.

    అంతేకాకుండా, ఈ కేసును విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సోమవారం తమ ముందు హాజరు కావాలని ఢిల్లీ ముఖ్యమంత్రికి ఆరోసారి సమన్లు పంపింది.

    ప్రతిసారి సీఎం విచారణకు గైర్హాజరవుతున్నారు. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని, కక్ష సాధింపు చర్యగా ఆప్ పేర్కొంటోంది

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఆవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అరవింద్ కేజ్రీవాల్

    #WATCH | Delhi CM Arvind Kejriwal says, "We can see that parties are being broken & governments are being toppled in other states by slapping false cases. In Delhi, they intend to arrest AAP leaders under the pretext of liquor policy case. They want to topple the Delhi Government… https://t.co/vuJF4CK7qG pic.twitter.com/trbjaxxPLn

    — ANI (@ANI) February 16, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అరవింద్ కేజ్రీవాల్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    అరవింద్ కేజ్రీవాల్

    నేడు రాజ్యసభకు దిల్లీ సర్వీసెస్ బిల్లు; విప్ జారీ చేసిన ఆప్, కాంగ్రెస్‌ దిల్లీ సర్వీసెస్ బిల్లు
    'దిల్లీ సర్వీసెస్ బిల్లు'కు రాజ్యసభలో ఆమోదం; సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఆప్ దిల్లీ సర్వీసెస్ బిల్లు
    రాహుల్ గాంధీ, ఖర్గేకు థ్యాంక్స్ చెప్పిన దిల్లీ సీఎం కేజ్రీవాల్  దిల్లీ
    సుదీర్ఘ ప్రసంగాలు చేయడం ద్వారా భారత్ విశ్వగురువు అవుతుందా?: కేజ్రీవాల్  దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025