NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi Assembly Elections: దిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్‌ 'మధ్యతరగతి మ్యానిఫెస్టో' విడుదల
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Delhi Assembly Elections: దిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్‌ 'మధ్యతరగతి మ్యానిఫెస్టో' విడుదల
    దిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్‌ 'మధ్యతరగతి మ్యానిఫెస్టో' విడుదల

    Delhi Assembly Elections: దిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్‌ 'మధ్యతరగతి మ్యానిఫెస్టో' విడుదల

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 22, 2025
    02:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో, రాజకీయ పార్టీలన్నీ ఓటర్లను ఆకర్షించేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి.

    ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తాజాగా 'మధ్యతరగతి మ్యానిఫెస్టో'ను విడుదల చేసింది.

    ఈ మ్యానిఫెస్టోలో మధ్యతరగతి ప్రజల ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో ఆప్ పార్టీ ఎంపీలు ప్రతిపాదించే ఏడు ప్రధాన బడ్జెట్ డిమాండ్లు పొందుపరిచారు.

    బుధవారం ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ దీనిని విడుదల చేశారు.

    "భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలు పన్నుల భారంతో ఇబ్బందులు పడుతున్నారు. పన్నుల బాధితులుగా మారి, అధికంగా చెల్లిస్తుండగా, తక్కువ ప్రయోజనాలు పొందుతున్నారు" అని కేజ్రీవాల్ తెలిపారు.

    వివరాలు 

    ప్రజల సొమ్మును వారి సంక్షేమానికి వినియోగిస్తే..

    దిల్లీలో వృద్ధులకు మెరుగైన వైద్యం, సంక్షేమం అందించేందుకు తాము సంజీవని పథకాన్ని ప్రారంభించామని కేజ్రీవాల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

    పన్ను చెల్లింపుదారుల సొమ్మును వారి సంక్షేమానికి వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే కొందరు దీన్ని ఉచితంగా విమర్శిస్తున్నారని పేర్కొన్నారు.

    "విదేశాల్లో ఇలాంటి పథకాలు అమలు చేస్తే మనం మెచ్చుకుంటాం. కానీ మన దేశంలో చేస్తే ఉచితాలని అంటారు. ప్రజల సొమ్మును వారి సంక్షేమానికి వినియోగిస్తే దేశం అభివృద్ధి చెందుతుంది" అని ఆయన అన్నారు.

    వివరాలు 

    ఆప్ ప్రతిపాదించిన ఏడు డిమాండ్లు: 

    1. విద్య: విద్య బడ్జెట్‌ను 2% నుంచి 10%కి పెంచడం, ప్రైవేటు పాఠశాలల ఫీజులను నియంత్రించడం.

    2. ఉన్నత విద్య: మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేలా ఉన్నత విద్యకు రాయితీలు కల్పించడం.

    3. ఆరోగ్యం: ఆరోగ్య బడ్జెట్‌ను 10%కి పెంచడం, ఆరోగ్య బీమాపై పన్నును తొలగించడం.

    4. ఆదాయపు పన్ను: మినహాయింపు పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడం.

    5. జీఎస్టీ: నిత్యావసర వస్తువులపై జీఎస్టీని తొలగించడం.

    6. సీనియర్ సిటిజన్ల సంక్షేమం: వృద్ధుల కోసం మెరుగైన పింఛను పథకాలు ప్రవేశపెట్టడం.

    7. రైల్వే రాయితీలు: సీనియర్ సిటిజన్లకు రైల్వేలో 50% రాయితీ కల్పించడం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అరవింద్ కేజ్రీవాల్

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    అరవింద్ కేజ్రీవాల్

    Arvind Kejriwal: అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌పై నేడు 'సుప్రీం' తీర్పు..! భారతదేశం
    Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. బెయిల్‌ మంజూరుచేసిన సుప్రీం భారతదేశం
    Arvind Kejriwal: సుప్రీంకోర్టు తీర్పు.. కేజ్రీవాల్‌ రాజీనామాకి బీజేపీ డిమాండ్‌  బీజేపీ
    Arvind Kejriwal: రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా: కేజ్రీవాల్ దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025