మతం ఆధారంగా ఓట్లు అడగడం సిగ్గుచేటు : అక్బరుద్దీన్ ఓవైసీ
ఈ వార్తాకథనం ఏంటి
రాబోయే కర్ణాటక ఎన్నికల్లో మెజారిటీ మతం ఆధారంగా కాంగ్రెస్, బీజేపీ ఓట్లు ఆడగడం సిగ్గుచేటు అని ఏఐఎంఐఎం ఛీప్ అసరుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు.
ఈ విషయమై అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. కాంగ్రెస్, బీజేపీ మతాల ప్రాతిపదకన బహిరంగంగా ఓట్లు అడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్లపై మండిపడ్డారు.
హనుమంతుడి పేరిట ఓటు వేయాలని ప్రధాని చేసిన అభ్యర్థనను, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హనుమాన్ ఆలయాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తానని డీకే శివకుమార్ హామీని ఒవైసీ ప్రస్తావించారు.
హుబ్లీలో కూల్చివేసిన దర్గా పునర్నిర్మాణానికి కాంగ్రెస్ చేపడుతుందా అని ఆయన ప్రశ్నించారు.
Details
భజరంగ్ దళ్ నినాదాలు చేయమనడం హస్యాస్పదం
బీజేపీతో సైద్ధాంతిక పోరులో లొంగిపోయిందని, తాను తక్బీర్ చెయ్యమని ప్రజలను కోరితే మోదీ ఓకే చేస్తారా అంటూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.
మే 10న పోలింగ్ బూత్లలో ఓటు వేస్తూ దుర్వినియోగానికి పాల్పడే వారిని శిక్షించాలని ప్రధాని మోదీ బుధవారం కర్ణాటక ప్రజలను కోరారు.
కర్నాటకలోని కోలార్లో జరిగిన సభలో ఒవైసీ మాట్లాడుతూ, "ఓటు వేసేటప్పుడు భజరంగ్ నినాదాలు చేయమని ప్రధానిఅడగడం, ఇది ఏ లౌకికవాదమని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మరిన్ని హనుమాన్ దేవాలయాలు నిర్మిస్తామని కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పడం హ్యాస్యాస్పదమన్నారు.
తాను ఓటు వేసినప్పుడు అల్లాహు అక్బర్ నినాదం చేయమని చెబితే మీడియా తనపై చిందులేస్తుందని వాపోయారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ట్విట్టర్ వేదికగా ఒవైసి బీజేపీ ,కాంగ్రెస్ పై ఫైర్
Congress & BJP are openly demanding votes on the basis of majority religion.
— Asaduddin Owaisi (@asadowaisi) May 4, 2023
Will Congress promise reconstruction of demolished dargah in Hubli? It has surrendered on its ideological battle with BJP. Will Modi be ok if I asked people to raise TAKBIR? The skies would fall pic.twitter.com/11eyGZvp8Z