NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భర్త, అత్తను చంపి, శరీర భాగాలను ఫ్రిజ్‌లో దాచిన భార్య
    తదుపరి వార్తా కథనం
    భర్త, అత్తను చంపి, శరీర భాగాలను ఫ్రిజ్‌లో దాచిన భార్య
    భర్త, అత్తను చంపి, శరీర భాగాలను ఫ్రిజ్‌లో దాచిన భార్య

    భర్త, అత్తను చంపి, శరీర భాగాలను ఫ్రిజ్‌లో దాచిన భార్య

    వ్రాసిన వారు Stalin
    Feb 20, 2023
    05:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఓ మహిళ తన భర్త, అత్తను హత్య చేసి, వారి మృతదేహాలను ముక్కలుగా నరికి మూడు రోజులు ఫ్రిజ్‌లో ఉంచింది. ఈ ఘటన అసోంలోని గువాహటిలో జరిగింది.

    ఆ తర్వాత మృతదేహాలను మేఘాలయలో పారవేసినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు. దాదాపు ఏడు నెలల క్రితం జరిగిన జంట హత్యకు సంబంధించిన ఈ కేసులో ప్రధాన నిందితురాలు కలిత, ఆమె స్నేహితుడు అరూప్ దాస్‌తో పాటు వీరికి సహకరించిన ధంజిత్ దేకా అనే వ్యక్తిని కూడా అరెస్టు చేశారు.

    భర్త అమరేంద్ర, అత్తను హత్య చేసిన తర్వాత, తనకేమి తెలియదన్నట్లు గవాహటిలోని నూన్‌మతి పోలీస్ స్టేషన్‌లో వారు కనిపించడం లేదని కలిత ఫిర్యాదు చేసింది. అప్పుడు విచారించినా కేసులో పురోగతి కనిపించలేదని పోలీసులు తెలిపారు.

    అసోం

    కొన్ని మృతదేహాల భాగాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

    కొంతకాలం తర్వాత కలిత భర్త అమరేంద్ర బంధవు, వీరు మిస్ అయినట్లు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొన్నిరోజులు ఆగి అతడు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

    ఈ క్రమంలో కేసును సీరియస్‌గా పోలీసులు అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించారు. భార్యపై అనుమానంతో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

    పోలీసుల విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించినట్లు గువాహటి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దిగంత కుమార్ తెలిపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు.

    భర్త, అత్త మృతదేహాలను ముక్కలుగా నరికి, ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేసి, ఆపై వాటిని మేఘాలయకు తరలించి, అక్కడ అడవిలో పారేశారని, కొన్ని భాగాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అస్సాం/అసోం

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    అస్సాం/అసోం

    అసోం: బాల్య వివాహాల కేసుల్లో 'పోక్సో'ను ఎందుకు ప్రయోగిస్తున్నారు?: గువాహటి హైకోర్టు ప్రశ్న గుహవాటి
    అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G సేవలు ఎయిర్ టెల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025