Page Loader
Delhi Elections 2025: నేడే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన.. దిల్లీలో పెరిగిన రాజకీయ వేడి
నేడే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన.. దిల్లీలో పెరిగిన రాజకీయ వేడి

Delhi Elections 2025: నేడే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన.. దిల్లీలో పెరిగిన రాజకీయ వేడి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 07, 2025
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

త్వరలో జరగనున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీ) ఈరోజు ప్రకటించనుంది. మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్ భవన్‌లో జరగనున్న విలేకరుల సమావేశంలో ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీల వివరాలను వెల్లడించనుంది. దిల్లీలో 70 మంది సభ్యుల అసెంబ్లీ పదవీకాలం ఫిబ్రవరి 23తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో, కొత్త అసెంబ్లీ ఏర్పాటు కోసం ఎన్నికలు త్వరలో నిర్వహించాల్సిన అవసరం ఉంది. దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో నిర్వహించే అవకాశం ఉంది. పోలింగ్ తేదీని ఫిబ్రవరి రెండవ వారంలో ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Details

దిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు

కేంద్ర పాలిత ప్రాంతమైన దిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఎన్నికల తేదీల అధికారిక ప్రకటనకు ముందే దేశ రాజధానిలో రాజకీయ ఉత్కంఠ పెరుగుతోంది. ఈసీ అధికారిక ప్రకటన అనంతరం, దిల్లీ ఎన్నికల నిర్వహణపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకే దశలో ఎన్నికలు జరగనున్నందున అన్ని రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచారానికి సిద్ధమవుతున్నాయి.