NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక రాజకీయాల్లో లింగాయత్‌లు ఎందుకంత కీలకం!
    తదుపరి వార్తా కథనం
    అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక రాజకీయాల్లో లింగాయత్‌లు ఎందుకంత కీలకం!
    కర్ణాటక రాజకీయాల్లో కీలకంగా మారిన లింగాయత్‌ సామాజిక వర్గం

    అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక రాజకీయాల్లో లింగాయత్‌లు ఎందుకంత కీలకం!

    వ్రాసిన వారు Stalin
    Mar 19, 2023
    08:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటక అసెంబ్లీ గడువు ఈ ఏడాది మే 24తో ముగియనుంది. రాష్ట్రంలో నెలరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారాలను ముమ్మరం చేశాయి.

    అయితే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా లింగాయత్‌ల అంశం కీలకంగా మారుతోంది.

    కర్ణాటకలో రెండు దశాబ్దాలుగా లింగాయత్‌ల అండతోనే బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది.

    కర్ణాటక జనాభాలో కర్ణాటకలో 17 శాతం లింగాయత్‌ల సమాజికవర్గమే ఉంది. మొత్తం 224 అసెంబ్లీ సీట్లలో కనీసం 154 స్థానాల్లో లింగాయత్‌ల ఉనికిని ఉంది. దాదాపు మెజార్టీ స్థానాల్లో వారే గెలుపోటములను శాసిస్తారు.

    ఇప్పటి వరకు రాష్ట్రంలో 9మంది లింగాయత్‌లు ముఖ్యమంత్రులుగా పని చేశారంటే, ఆ సామాజిక వర్గం రాష్ట్రంలో ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు.

    కర్ణాటక

    రాజీవ్ గాంధీ ప్రకటనతో కాంగ్రెస్ నుంచి బీజేపీ వైపు మళ్లిన లింగాయత్‌లు

    వాస్తవానికి లింగాయత్‌లు మొదటి నుంచి కాంగ్రెస్‌కు మద్దతుదారులుగా ఉన్నారు. డి.దేవరాజ్ ఉర్స్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసంస్కరణలు వల్ల భూస్వామ్య వర్గాలైన లింగాయత్‌లను ఆ పార్టీకి దూరం చేశాయి. 1983ఎన్నికల్లో లింగాయత్‌లు జనతా పార్టీ వైపు మళ్లారు.

    తప్పును గ్రహించిన కాంగ్రెస్ లింగాయత్‌వర్గానికి చెందిన వీరేంద్ర పాటిల్ నాయకత్వంలో 1989ఎన్నికల్లో పోటీ చేసింది.

    ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అయితే 1990లో పాటిల్ పక్షవాతానికి గురయ్యారు. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ ప్రముఖ వెనుకబడిన తరగతుల నాయకుడు బంగారప్పను పాటిల్ స్థానంలో నియమించారు.

    కర్ణాటక రాజకీయ చరిత్రలో దీన్ని కీలక మలుపుగా చెప్పుకుంటారు. ఆ తర్వాత ఇక లింగాయత్‌ల మద్దతును కాంగ్రెస్ నుంచి బీజేపీ వైపు మళ్లడం ప్రారంభించారు.

    కర్ణాటక

    లింగాయత్‌లను ఆకర్షించడానికి పోటీపడుతున్న బీజేపీ-కాంగ్రెస్

    కర్ణాటకలో 1980-90కాలంలో బీజేపీలో యడ్యూరప్ప రాజకీయంగా ఎదుగుతున్నారు. ఈయన లింగాయత్‌‌కావడంతో రాజీవ్ గాంధీ నిర్ణయం నేపథ్యంలో ఆ సమాజిక వర్గం ఏకపక్షంగా యడ్యూరప్పకు, బీజేపీకి మద్దతగా నిలిచింది. అప్పటివరకు బీజేపీకి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న యడ్యూరప్ప, లింగాయత్‌ల మద్దతుతో 1999నాటికి అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎదిగారు. ఆ తర్వాత సీఎంగా చేశారు.

    2019లో బీజేపీ అధికారంలోకి వచ్చాక, యడ్యూరప్పను బీజేపీ ముఖ్యమంత్రిగా తొలగించింది. ఈ క్రమంలో లింగాయత్‌లు ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే ఆ సమాజికవర్గాన్ని శాంతింపజేసేందుకు అదే లింగాయత్ వర్గానికి చెందిన బసవరాజు బొమ్మైని ముఖ్యమంత్రిగా ప్రకటించింది బీజేపీ.

    2023అసెంబ్లీ ఎన్నికల్లో లింగాయత్‌లను ఆకర్షించడానికి బీజేపీకి ధీటుగా కాంగ్రెస్ వ్యహాలు రచిస్తోంది. ఆ పార్టీలోని లింగాయత్ లను తెరపైకి తెస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    అసెంబ్లీ ఎన్నికలు
    బీజేపీ
    కాంగ్రెస్

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    కర్ణాటక

    కరోనా BF.7 వేరియంట్ సోకిన వారికి అక్కడ ఉచితంగా చికిత్స కోవిడ్
    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    కాలేజీలో దారుణం.. విద్యార్థినిపై కత్తితో పొడిచి హత్య.. భారతదేశం
    మెట్రో పిల్లర్ కూలి తల్లి, మూడేళ్ల కుమారుడు దుర్మరణం భారతదేశం

    అసెంబ్లీ ఎన్నికలు

    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ అమిత్ షా
    కర్ణాటక: అసెంబ్లీ ఎన్నికల వేళ.. రథయాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ కర్ణాటక
    2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు జేపీ నడ్డా
    Election Commission: నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్‌ విడుదల త్రిపుర

    బీజేపీ

    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? నరేంద్ర మోదీ
    విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచింది తేజస్వి సూర్యనా? 'బీజేపీ వీఐపీ బ్రాట్స్' కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు విమానం
    చిక్కుల్లో బండి సంజయ్ కుమారుడు, తోటి విద్యార్థులపై దాడి చేసిన వీడియోలు వైరల్ బండి సంజయ్
    మహారాష్ట్ర కొత్త గవర్నర్‌గా కెప్టెన్ అమరీందర్ సింగ్ నియామకం! మహారాష్ట్ర

    కాంగ్రెస్

    కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఏకే ఆంటోనీ కొడుకు అనిల్, మోదీకి మద్దతుగా పార్టీకి రాజీనామా కేరళ
    సర్జికల్ స్ట్రైక్స్: 'జవాన్లపై నమ్మకం ఉంది, కానీ బీజేపీని విశ్వసించలేం' రాహుల్ గాంధీ
    'భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించండి', అమిత్ షాకు ఖర్గే లేఖ రాహుల్ గాంధీ
    నేడు శ్రీనగర్‌లో 'భారత్ జోడో యాత్ర' ముగింపు వేడుక, 21 పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం రాహుల్ గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025