NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక రాజకీయాల్లో లింగాయత్‌లు ఎందుకంత కీలకం!
    భారతదేశం

    అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక రాజకీయాల్లో లింగాయత్‌లు ఎందుకంత కీలకం!

    అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక రాజకీయాల్లో లింగాయత్‌లు ఎందుకంత కీలకం!
    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 19, 2023, 08:31 am 1 నిమి చదవండి
    అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక రాజకీయాల్లో లింగాయత్‌లు ఎందుకంత కీలకం!
    కర్ణాటక రాజకీయాల్లో కీలకంగా మారిన లింగాయత్‌ సామాజిక వర్గం

    కర్ణాటక అసెంబ్లీ గడువు ఈ ఏడాది మే 24తో ముగియనుంది. రాష్ట్రంలో నెలరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారాలను ముమ్మరం చేశాయి. అయితే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా లింగాయత్‌ల అంశం కీలకంగా మారుతోంది. కర్ణాటకలో రెండు దశాబ్దాలుగా లింగాయత్‌ల అండతోనే బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. కర్ణాటక జనాభాలో కర్ణాటకలో 17 శాతం లింగాయత్‌ల సమాజికవర్గమే ఉంది. మొత్తం 224 అసెంబ్లీ సీట్లలో కనీసం 154 స్థానాల్లో లింగాయత్‌ల ఉనికిని ఉంది. దాదాపు మెజార్టీ స్థానాల్లో వారే గెలుపోటములను శాసిస్తారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 9మంది లింగాయత్‌లు ముఖ్యమంత్రులుగా పని చేశారంటే, ఆ సామాజిక వర్గం రాష్ట్రంలో ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు.

    రాజీవ్ గాంధీ ప్రకటనతో కాంగ్రెస్ నుంచి బీజేపీ వైపు మళ్లిన లింగాయత్‌లు

    వాస్తవానికి లింగాయత్‌లు మొదటి నుంచి కాంగ్రెస్‌కు మద్దతుదారులుగా ఉన్నారు. డి.దేవరాజ్ ఉర్స్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసంస్కరణలు వల్ల భూస్వామ్య వర్గాలైన లింగాయత్‌లను ఆ పార్టీకి దూరం చేశాయి. 1983ఎన్నికల్లో లింగాయత్‌లు జనతా పార్టీ వైపు మళ్లారు. తప్పును గ్రహించిన కాంగ్రెస్ లింగాయత్‌వర్గానికి చెందిన వీరేంద్ర పాటిల్ నాయకత్వంలో 1989ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అయితే 1990లో పాటిల్ పక్షవాతానికి గురయ్యారు. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ ప్రముఖ వెనుకబడిన తరగతుల నాయకుడు బంగారప్పను పాటిల్ స్థానంలో నియమించారు. కర్ణాటక రాజకీయ చరిత్రలో దీన్ని కీలక మలుపుగా చెప్పుకుంటారు. ఆ తర్వాత ఇక లింగాయత్‌ల మద్దతును కాంగ్రెస్ నుంచి బీజేపీ వైపు మళ్లడం ప్రారంభించారు.

    లింగాయత్‌లను ఆకర్షించడానికి పోటీపడుతున్న బీజేపీ-కాంగ్రెస్

    కర్ణాటకలో 1980-90కాలంలో బీజేపీలో యడ్యూరప్ప రాజకీయంగా ఎదుగుతున్నారు. ఈయన లింగాయత్‌‌కావడంతో రాజీవ్ గాంధీ నిర్ణయం నేపథ్యంలో ఆ సమాజిక వర్గం ఏకపక్షంగా యడ్యూరప్పకు, బీజేపీకి మద్దతగా నిలిచింది. అప్పటివరకు బీజేపీకి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న యడ్యూరప్ప, లింగాయత్‌ల మద్దతుతో 1999నాటికి అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎదిగారు. ఆ తర్వాత సీఎంగా చేశారు. 2019లో బీజేపీ అధికారంలోకి వచ్చాక, యడ్యూరప్పను బీజేపీ ముఖ్యమంత్రిగా తొలగించింది. ఈ క్రమంలో లింగాయత్‌లు ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే ఆ సమాజికవర్గాన్ని శాంతింపజేసేందుకు అదే లింగాయత్ వర్గానికి చెందిన బసవరాజు బొమ్మైని ముఖ్యమంత్రిగా ప్రకటించింది బీజేపీ. 2023అసెంబ్లీ ఎన్నికల్లో లింగాయత్‌లను ఆకర్షించడానికి బీజేపీకి ధీటుగా కాంగ్రెస్ వ్యహాలు రచిస్తోంది. ఆ పార్టీలోని లింగాయత్ లను తెరపైకి తెస్తోంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    కర్ణాటక
    అసెంబ్లీ ఎన్నికలు
    కాంగ్రెస్
    బీజేపీ

    తాజా

    మార్చి 24న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం; టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం ఎమ్మెల్సీ
    మారుతీ సుజుకి ఏప్రిల్ నుంచి మోడల్ రేంజ్ ధరలను పెంచనుంది ఆటో మొబైల్
    ఉబర్ యాప్ లో తప్పులు కనిపెట్టి 4.6లక్షలు రివార్డు అందుకున్న ఆనంద్ ప్రకాష్ జీవనశైలి

    కర్ణాటక

    అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో కొత్త వివాదం; టిప్పు సుల్తాన్‌ను ఎవరు చంపారు? అసెంబ్లీ ఎన్నికలు
    కాంగ్రెస్‌లోకి బీజేపీ ఎమ్మెల్సీ; ఎన్నికల వేళ కమలం పార్టీకి షాక్ బీజేపీ
    గత వారమే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం; అప్పుడే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు; ఎందుకిలా? బెంగళూరు
    శివమొగ్గ ఐఎస్ కుట్ర కేసు: ఇద్దరు బీటెక్ గ్రాడ్యుయేట్లపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్ ఎన్ఐఏ

    అసెంబ్లీ ఎన్నికలు

    కర్ణాటకకు కలిసొచ్చిన అసెంబ్లీ ఎన్నికలు; మూడు నెలల్లో రాష్ట్రానికి ఆరోసారి ప్రధాని మోదీ రాక నరేంద్ర మోదీ
    వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచి ఓటు వేయొచ్చు: ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం
    సర్వేలన్నీ బీఆర్ఎస్‌కే అనుకూలం, డిసెంబర్‌లోనే తెలంగాణలో ఎన్నికలు: సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    మేఘాలయలో 45కు చెరిన సంగ్మా బలం; నేడు అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం మేఘాలయ

    కాంగ్రెస్

    కేంద్రం ఆరోపణలపై స్పందించడానికి అనుమతి ఇవ్వండి; స్పీకర్‌కు రాహుల్ గాంధీ లేఖ రాహుల్ గాంధీ
    రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖచిత్రంగా ఉంటే మోదీకే లాభం: మమతా బెనర్జీ మమతా బెనర్జీ
    నెహ్రూ కుటుంబాన్ని అవమానించారని ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ బీజేపీ
    లండన్‌లో రాహుల్ వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్; 20వ తేదీకి ఉభయ సభలు వాయిదా రాహుల్ గాంధీ

    బీజేపీ

    ప్రపంచంలోనే బీజేపీ అత్యంత ముఖ్యమైన పార్టీ: వాల్ స్ట్రీట్ జర్నల్ ది వాల్ స్ట్రీట్ జర్నల్
    ప్రభుత్వాన్ని నియంతలా నడుపుతున్న ప్రధాని మోదీ: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మల్లికార్జున ఖర్గే
    రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక ఎన్నికలు
    తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్ నితీష్ కుమార్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023