NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Atishi Marlena: ఏపీలో టీచర్‌ గా పని చేసిన ఢిల్లీ సీఎం అతిషి.. ఆ స్కూల్ ఎక్కడుందంటే!
    తదుపరి వార్తా కథనం
    Atishi Marlena: ఏపీలో టీచర్‌ గా పని చేసిన ఢిల్లీ సీఎం అతిషి.. ఆ స్కూల్ ఎక్కడుందంటే!
    ఏపీలో టీచర్‌ గా పని చేసిన ఢిల్లీ సీఎం అతిషి

    Atishi Marlena: ఏపీలో టీచర్‌ గా పని చేసిన ఢిల్లీ సీఎం అతిషి.. ఆ స్కూల్ ఎక్కడుందంటే!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 18, 2024
    03:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అతిషి మార్లెనా ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. త్వరలోనే ఆమె అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

    ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమెను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.

    అరవింద్ కేజ్రీవాల్‌ ఇటీవల ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జైలుకు వెళ్లిన తరువాత సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

    అతిషి గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఆమె ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనుభవం ఉంది.

    అన్నమయ్య జిల్లా, కురబలకోట మండలంలోని రిషివ్యాలీ స్కూల్‌లో 2003 జులై నుంచి 2004 మార్చి వరకు హిస్టరీ టీచర్‌గా పని చేశారు.

    అలాగే, 6,7 తరగతులకు ఇంగ్లీష్ పాఠాలు బోధించారు.

    వివరాలు 

    రిషివ్యాలీ స్కూల్‌ను స్థాపించిన జిడ్డు కృష్ణమూర్తి

    ఆమె ఢిల్లీకి ముఖ్యమంత్రిగా మారబోతున్నారని తెలిసి,ఆమె పూర్వ విద్యార్థులు, స్కూల్ స్టాఫ్ సంతోషం వ్యక్తం చేశారు.

    ఈ రిషివ్యాలీ స్కూల్‌ను ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి స్థాపించారు. అతిషి 2013లో ఆప్ పార్టీలో చేరారు.

    పార్టీ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఆమె మూడేళ్లపాటు మనీష్ సిసోడియాకు ముఖ్య సలహాదారుగా పనిచేశారు.

    2019లో ఈస్ట్ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ చేతిలో ఓడిపోయారు.

    2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాల్‌కాజీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.

    వివరాలు 

    హిస్టరీలో డిగ్రీ.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ

    2023లో మనీశ్ సిసోడియా అరెస్ట్ అయిన తర్వాత,అతిషి విద్య, ప్రజాపనులు,సంస్కృతి, పర్యాటక శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

    ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సిసోడియా,సంజయ్ సింగ్ అరెస్ట్ కావడంతో, ఆప్‌లో ఆమె కీలక నాయకురాలిగా ఎదిగారు.

    కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత, అతిషి ఆర్థిక శాఖ సహా మరికొన్ని ముఖ్యమైన శాఖలను నిర్వహించారు.

    అతిషి ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయకుమార్ సింగ్,త్రిప్తా వహి దంపతుల కుమార్తె.

    ఆమె విద్యాభ్యాసం ఢిల్లీలోని స్ప్రింగ్‌డేల్ స్కూల్‌లో జరిగింది.సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుండి హిస్టరీలో డిగ్రీ తీసుకున్న ఆమె ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ పొందారు.

    ఆప్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నఅతిషి ప్రస్తుతం ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలిగా ఉన్నారు.మంత్రిగా మంచి పేరు సంపాదించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అతిషి మార్లెనా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    అతిషి మార్లెనా

    Delhi Water Crisis: క్షిణించిన అతిషి ఆరోగ్యం.., ఆస్పత్రికి తరలింపు  భారతదేశం
    Coaching Centres: కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లను నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కొత్త చట్టం  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025