NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Atishi: దిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఆతిశీ ఏకగ్రీవంగా ఎన్నిక.. తొలిసారి ఓ మహిళ బాధ్యతలు స్వీకరణ
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Atishi: దిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఆతిశీ ఏకగ్రీవంగా ఎన్నిక.. తొలిసారి ఓ మహిళ బాధ్యతలు స్వీకరణ
    దిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఆతిశీ ఏకగ్రీవంగా ఎన్నిక.. తొలిసారి ఓ మహిళ బాధ్యతలు స్వీకరణ

    Atishi: దిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఆతిశీ ఏకగ్రీవంగా ఎన్నిక.. తొలిసారి ఓ మహిళ బాధ్యతలు స్వీకరణ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 23, 2025
    04:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి ఆతిశీని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

    ఆదివారం జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

    ఎమ్మెల్యే సంజీవ్ ఝా ఆమె పేరును ప్రతిపాదించగా, మిగతా అందరూ మద్దతు ప్రకటించారు. దిల్లీలో ప్రతిపక్ష నేతగా ఓ మహిళ ఎన్నిక కావడం ఇదే తొలిసారి.

    Details

    ఆప్ శాసనసభాపక్ష భేటీలో కీలక నిర్ణయం 

    ఆప్ శాసనసభాపక్ష భేటీకి పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా ఇటీవల ఎన్నికైన 22 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

    కాల్‌కాజీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆతిశీ, తనను ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నందుకు పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.

    అసెంబ్లీలో ప్రజల తరఫున బలమైన స్వరం వినిపిస్తామని, బీజేపీ సర్కారుపై ఒత్తిడి తీసుకువస్తామని ఆమె అన్నారు.

    బీజేపీ పాలనలో కొత్త అధ్యాయం

    ఇటీవల జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 26 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చి, ఆప్ పాలనకు ముగింపు పలికింది. రేఖా గుప్తా కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

    ఈ నెల 24 నుంచి దిల్లీ అసెంబ్లీ తొలి సెషన్ ప్రారంభంకానుంది.

    Details

    కాగ్ నివేదికలపై చర్చ

    మూడు రోజులపాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో గత ఆప్ ప్రభుత్వ పనితీరుపై పెండింగ్‌లో ఉన్న కాగ్ నివేదికలను ప్రవేశపెట్టనున్నట్లు బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది.

    ఈ సమావేశాలు దిల్లీ రాజకీయాల్లో కీలక మలుపు తీసుకురానున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    తాజా

    2025 Suzuki V-Strom 800DE: భారత్ లో విడుదలైన 2025 సుజుకి V-స్ట్రోమ్ 800DE.. రూ.10,30,000 ఎక్స్-షోరూమ్ ధర ఆటో మొబైల్
    Elon Musk: కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. మస్క్ పెట్టిన పోల్‌కు భారీ రెస్పాన్స్..  ఎలాన్ మస్క్
    Chenab bridge: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ ..  నరేంద్ర మోదీ
    Home loan: గృహ రుణాలదారులకు ఊరట.. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ  ఆర్ బి ఐ

    దిల్లీ

    Etikoppaka Toys : రిపబ్లిక్ డే పరేడ్‌లో ఏపీ శకటానికి ప్రతిష్టాత్మక మూడో స్థానం! గణతంత్ర దినోత్సవం
    Swati Maliwal: కేజ్రీవాల్ ఇంటి బయట చెత్త పోసిన స్వాతి మలివాల్‌.. అదుపులోకి తీసుకున్న పోలీసులు భారతదేశం
    Arvind Kejriwal: బీజేపీ గెలిస్తే ఢిల్లీలో అన్ని సేవలు ఆగిపోతాయి.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు అరవింద్ కేజ్రీవాల్
    Delhi assembly elections: దిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం  భారతదేశం

    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    PM Modi degree Row: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు భారీ షాక్.. ప్రధాని మోదీ డిగ్రీ కేసులో పిటిషన్‌ తిరస్కరణ సుప్రీంకోర్టు
    Raaj Kumar Anand: ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్.. మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ రాజీనామా దిల్లీ
    President Rule: ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టి రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది: అతిషి  భారతదేశం
    Sunitha Kejriwal: ఆప్ తరపున సునీతా కేజ్రీవాల్ ప్రచారం.. గుజరాత్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల  గుజరాత్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025