Assam: అస్సాం మంత్రికి బెదిరింపు.. పోలీసుల అదుపులో వ్యక్తి
సోషల్ మీడియాలో అస్సాం మంత్రి అతుల్ బోరాను బెదిరించినందుకు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ గురువారం తెలిపారని న్యూస్ ఏజెన్సీ పిటిఐ నివేదించింది. సోషల్ మీడియాలో బోరాకు ప్రాణహాని ఉందని అస్సాం సిఐడి మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. శివసాగర్ జిల్లా గౌరీసాగర్లోని బామున్ మోరన్ గ్రామానికి చెందిన 31 ఏళ్ల యువకుడు తన ఫేస్బుక్ ఖాతా నుండి రాష్ట్ర వ్యవసాయ మంత్రిని బెదిరించినట్లు సింగ్ చెప్పారు. బోరా రాష్ట్రంలోని అధికార బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి మిత్రపక్షమైన అసోమ్ గణ పరిషత్ అధ్యక్షుడు.