
Ayodhya: రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తం ఖరారు.. జూన్ 3 నుంచి 5 వరకు కార్యక్రమాలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
త్రేతాయుగం నాటి రామ దర్బార్కు సంబంధించిన ఆధ్యాత్మిక భావన ప్రజల హృదయాల్లో ఆవిష్కృతమై ఉంది.
త్వరలో ఆ ఊహ ఆధ్యాత్మిక స్వరూపంగా నిజమవుతూ అయోధ్యలో స్పష్టంగా ప్రత్యక్షమయ్యే అవకాశముంది.
గంగా దశరా పర్వదినాన్ని పురస్కరించుకుని రామాలయంలో రామ దర్బార్కు ఘనంగా ప్రతిష్ఠ జరగబోతోంది.
ఈ కార్యక్రమంలో రామాలయ ప్రాంగణంలో మరో ఏడు దేవాలయాలకు పవిత్రీకరణ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.
ఈ మహామంగళ ఘట్టాన్ని పురస్కరించుకుని జూన్ 5న ఉదయం 11:25 నుంచి 11:40 వరకు అభిజిత్ ముహూర్తాన్ని ఖరారు చేశారు.
ఇదే సమయానికి ద్వాపరయుగం ప్రారంభమైందన్న విశ్వాసం ఉన్నది. ఇది గంగా దశరా రోజే కావడం విశేషం.
వివరాలు
అదే రోజు దేవాలయాల్లోనూ దేవతా విగ్రహాల ప్రతిష్ఠ
ఈ ఉత్సవానికి ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు.
రామయ్య, సీతామాత, లక్ష్మణుడు, హనుమంతుడు రామాలయం మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన రామ దర్బార్లో ఆసీనులై భక్తులకు దర్శనమిస్తారు.
ఆలయ ప్రాంగణంలోని ఇతర నిర్మాణాల్లో ఏర్పాటు చేసిన దేవాలయాల్లోనూ దేవతా విగ్రహాల ప్రతిష్ఠను అదే రోజు చేపడతారు.
ఈ కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లన్నీ జూన్ 2నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు.
వివరాలు
కలశ యాత్రతో ప్రారంభం
విధివిధానంగా కలశ యాత్రతో ఈ మహోత్సవ కార్యక్రమాలు మొదలవుతాయి.
ఆ తర్వాత జూన్ 3న యాగమండపానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అగ్నిదేవునికి ప్రతిష్ఠ చేస్తారు.
జూన్ 3 నుంచి జూన్ 5 వరకూ మూడు రోజుల పాటు వివిధ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
యాగమండప నిర్మాణాన్ని జూన్ 1 నాటికి పూర్తి చేయాలని ట్రస్ట్ అధికారులు స్పష్టం చేశారు.
ఈ యాగానికి కాశీ పీఠాధీశ్వరుడు శంకరాచార్య స్వామి అవధేశానంద గిరి, ఆచార్య విద్యా రామానుజాచార్య స్వామి, సౌభాగ్య నారాయణాచార్య స్వామి వంటి ప్రముఖ సాధువులు, దేశం నలుమూలల నుండి విచ్చేసే మహాత్ములు, దక్షిణ భారతదేశానికి చెందిన వేద పండితులు, పీఠాధిపతులు పాల్గొననున్నారు.
వివరాలు
ప్రముఖులను ఆహ్వానించిన ట్రస్ట్
ఈ కార్యక్రమానికి ఢిల్లీలోని పండిట్ ఇంద్రేష్ మిశ్రా, ఆచార్య ప్రవీణ్ శర్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు.
అంతేకాకుండా వివిధ మత సంప్రదాయాలకు చెందిన ప్రముఖ సాధువులు, మతగురువులు, ఆర్ఎస్ఎస్, విహెచ్పి, రామమందిర్ ట్రస్ట్ సభ్యులకు కూడా ఆహ్వానాలు పంపించారు.
కార్యక్రమంలో పాల్గొనబోయే గౌరవ అతిథుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేశామని, వారిని ఒక్కొక్కరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
ఇందుకు సంబంధించి బాధ్యతలను ఇంద్రదేవ్ మిశ్రా,ఆచార్య ప్రవీణ్ శర్మలకు అప్పగించారు.
అంతేగాకుండా ఆచారాలను నిర్వహించే పండితుల జాబితాను కూడా తుది నిర్ణయానికి తీసుకువచ్చినట్టు పేర్కొన్నారు.