Ram Mandir: రామ మందిర శంకుస్థాపనకు అద్వానీ, జోషిని ఆహ్వానించిన విశ్వహిందూ పరిషద్
వచ్చే నెలలో జరగనున్న రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా బీజేపీ కురువృద్ధులు లాల్ కృష్ణ అద్వానీ,మురళీ మనోహర్ జోషిలకు ఆహ్వానం పంపినట్లు విశ్వహిందూ పరిషద్ మంగళవారం తెలిపింది. వృద్ధాప్యం కారణంగా ఇరువురు నేతలను వేడుకకు రావద్దని 'అభ్యర్థన' చేశారంటూ రామ్ టెంపుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. వచ్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని సీనియర్లు ఇద్దరూ చెప్పారని వీహెచ్పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు. అంతకుముందు రోజు, చంపత్ రాయ్ విలేకరులతో మాట్లాడుతూ, "ఇద్దరూ కుటుంబ పెద్దలని వారి వయస్సును దృష్టిలో ఉంచుకుని, రావద్దని అభ్యర్థించామని,దానికి ఇద్దరూ అంగీకరించారని తెలిపారు.