NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ayodhya Ram Temple : అయోధ్య లో భారీ వర్షం..రామ మందిరం పై కప్పు నుండి నీరు లీక్
    తదుపరి వార్తా కథనం
    Ayodhya Ram Temple : అయోధ్య లో భారీ వర్షం..రామ మందిరం పై కప్పు నుండి నీరు లీక్
    అయోధ్య లో భారీ వర్షం..రామ మందిరం పై కప్పు నుండి నీరు లీక్

    Ayodhya Ram Temple : అయోధ్య లో భారీ వర్షం..రామ మందిరం పై కప్పు నుండి నీరు లీక్

    వ్రాసిన వారు Stalin
    Jun 25, 2024
    11:36 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్,అయోధ్యలోని రామాలయంలోగర్భగుడి పైకప్పు నుండి నీరు లీక్ అయిందని దాని ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ సోమవారం తెలిపారు.

    భారీ వర్షం తర్వాత ఇలా జరగడం భక్తుల్లో ఆందోళ కలిగిస్తుంది. ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పూజారి ఆరోపించారు.

    శనివారం అర్ధరాత్రి జల్లులు పడిన తర్వాత ఆలయ ప్రాంగణం నుండి వర్షపు నీరు వెళ్లే ఏర్పాటు కూడా లేదని, అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులను ప్రధాన పూజారి కోరారు.

    వివరాలు 

    ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా సందర్శన

    ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా ఆలయానికి చేరుకుని పైకప్పును చూశారు.

    మరమ్మతులు చేసి వాటర్‌ప్రూఫ్‌గా మార్చాలని ఆదేశాలు ఇచ్చారని ఆలయ ట్రస్ట్ వర్గాలు తెలిపాయి.ఆలయ నిర్మాణ పురోగతి గురించి మిశ్రా విలేకరులతో విడివిడిగా మాట్లాడారు.

    మొదటి అంతస్తు పనులు కొనసాగుతున్నాయని, ఈ ఏడాది జూలై నాటికి పూర్తవుతాయని, డిసెంబర్ నాటికి ఆలయ నిర్మాణం పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    ఆచార్య సత్యేంద్ర దాస్ విలేకరులతో మాట్లాడుతూ ఆలయ గర్భగుడి పైకప్పు నుండి భారీ లీకేజీ ఏర్పడింది.

    రామ్ లల్లా విగ్రహం ముందు పూజారి కూర్చునే స్థలం , విఐపి దర్శనం కోసం ప్రజలు వచ్చే ప్రదేశం నుండి నేరుగా పైకప్పు నుండి వర్షపు నీరు కారుతోంది.

    వివరాలు 

    రంగంలోకి దిగిన అయోధ్య మేయర్ గిరీష్ పతి త్రిపాఠి

    జల్వాన్‌పురా నుంచి హనుమాన్‌గర్హి భక్తిపథ్‌ వరకు, తేది బజార్‌ నుంచి లోపలి ప్రాంతాల వరకు నీటి ముంపు ఎక్కువగా ఉందని స్థానికులు తెలిపారు.

    వర్షం సమయంలో రాంపథ్‌లోని సందుల్లో మురుగు నీరు ఇళ్లలోకి చేరడంపై అయోధ్య మేయర్ గిరీష్ పతి త్రిపాఠి స్పందించారు.

    ఉదయం నుండి నష్ట నియంత్రణ చర్యలు మొదలయ్యాయని తెలిపారు. ఇళ్ల నుండి నీటిని తొలగించడానికి మున్సిపాలిటీకి చెందిన అనేక బృందాలను నియమించామన్నారు

    .అయితే, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి) ఉన్నతాధికారుల స్పందన కోరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

    వివరాలు 

    నిర్మాణంలో అవినీతి కాంగ్రెస్ ఆరోపణ

    ఇదిలా ఉండగా, ఆలయ నిర్మాణంలో, దేవాలయ పట్టణంలో పౌర సదుపాయాల కల్పనలో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అవినీతికి పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది.

    అది అమరవీరుల శవపేటిక కావచ్చు లేదా దేవుడి గుడి కావచ్చు, ఇవన్నీ బిజెపికి అవినీతికి అవకాశాలుగా మారాయి.

    దేశంలో విశ్వాసం , స్వచ్ఛత యొక్క చిహ్నాలు కూడా వారికి దోచుకునే అవకాశాలు మాత్రమే" అని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ అన్నారు. సోమవారం ఒక ప్రకటనలోతీవ్రంగా దుయ్యబట్టారు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అయోధ్య

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    అయోధ్య

     Congress: రామాలయం ఎఫెక్ట్.. కాంగ్రెస్‌కు ఎమ్మెల్యే రాజీనామా కాంగ్రెస్
    PM Modi: 'అనుష్ఠానం'లో భాగంగా.. రోజూ గంటకుగా ప్రత్యేక మంత్రాన్ని జపిస్తున్న మోదీ నరేంద్ర మోదీ
    Ayodhya Ram Mandir: అయోధ్య రాముడి ప్రసాదం అంటూ Amazonలో అమ్మకం.. కేంద్రం నోటీసులు  అమెజాన్‌
    Ayodhya Ram Temple: అయోధ్య తీర్పు చెప్పిన ఐదుగురు జడ్జిలు ఎవరు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025