NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ayodhya: అయోధ్య రామమందిరానికి ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు 
    తదుపరి వార్తా కథనం
    Ayodhya: అయోధ్య రామమందిరానికి ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు 
    అయోధ్య రామమందిరానికి ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు

    Ayodhya: అయోధ్య రామమందిరానికి ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 15, 2025
    05:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రమైన అయోధ్యలోని రామాలయానికి బాంబు బెదిరింపులు రావడంతో ఉత్కంఠ చోటుచేసుకుంది.

    కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కలెక్టరేట్లకు ఈ-మెయిల్‌లు పంపిస్తూ రామాలయాన్ని పేల్చివేస్తామని హెచ్చరించారు.

    ఈ సమాచారం అందిన వెంటనే భద్రతా విభాగాలు అప్రమత్తమయ్యాయి. ఆలయం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు.

    సమీప ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీలను పరిశీలించారు.ఈ నేపథ్యంలో అయోధ్య సైబర్ క్రైం పోలీసులు అధికారికంగా కేసు నమోదు చేశారు.

    ఈ బెదిరింపు మెయిల్ తమిళనాడులోని ఒక ప్రాంతం నుంచి ఇంగ్లీష్ భాషలో వచ్చినట్టు అధికారులు తెలిపారు.

    ఈ మెయిల్‌కు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తును పోలీసులు ప్రారంభించారు.

    కేవలం అయోధ్యకు మాత్రమే కాకుండా, బారాబంకి, ఇతర సమీప జిల్లాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు.

    వివరాలు 

    గోడ నిర్మాణానికి 18 నెలల సమయం

    ఇదే తరహాలో గతంలోనూ అయోధ్య రామాలయాన్ని లక్ష్యంగా చేసుకొని బెదిరింపులు వచ్చాయి.

    ఖలీస్థానీ ఉగ్రవాది పన్నూ అప్పట్లో ఇదే విధంగా బెదిరించాడు.ఈ తరహా ప్రమాదాల నేపథ్యంలో రామాలయం,అయోధ్య నగరంలో సెక్యూరిటీ చర్యలు మరింత కఠినంగా అమలులోకి తెచ్చారు.

    ఈ ప్రాంతాన్ని పూర్తిగా డ్రోన్ నిఘా పరిధిలోకి తీసుకొచ్చారు. రామాలయ భద్రతను మరింత బలపర్చే ఉద్దేశంతో, దాదాపు 4 కిలోమీటర్ల పొడవున గోడ నిర్మాణాన్ని ప్రారంభించినట్టు రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు.

    ఈ నిర్మాణ పనులు "ఇంజినీర్ ఇండియా లిమిటెడ్" అనే సంస్థచే చేపట్టబడుతున్నాయని, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేందుకు సుమారు 18 నెలల సమయం పడుతుందని ఆయన తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అయోధ్య
    బాంబు బెదిరింపు

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    అయోధ్య

    Ayodhya ram mandir: 13వేల మంది బలగాలు, 10వేల సీసీ కెమెరాలు.. రామమందిర ప్రారంభోత్సవానికి భద్రత కట్టుదిట్టం  శ్రీరాముడు
    PM Modi: రామమందిర ప్రారంభోత్సవం దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    Ayodhya Ram Mandir: అయోధ్య 'ప్రాణ ప్రతిష్టకు'ఎల్‌కే అద్వానీ దూరం.. ఎందుకంటే?  భారతదేశం
    Sri Ram puja: అయోధ్య రామాలయం ప్రారంభోత్స వేళ.. మీ ఇంట్లోనే శ్రీరాముడిని ఈ విధానంలో పూజించండి శ్రీరాముడు

    బాంబు బెదిరింపు

    Bomb Threat: ముంబై-న్యూయార్క్ ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. దిల్లీలో అత్యవసర ల్యాడింగ్ ఎయిర్ ఇండియా
    IndiGo flights: ముంబై నుంచి పశ్చిమాసియాకు వెళ్తున్న.. రెండు ఇండిగో విమానాలకు బెదిరింపులు` ఇండిగో
    Bomb Threat: 48 గంటలలోపు 10 విమానాలకు బాంబు బెదిరింపు.. దర్యాప్తునకు ఏవియేషన్ బాడీ ఆదేశం  విమానం
    Bomb Threats: విమానాలపై వరుస బాంబు బెదిరింపులు.. అనుమానితుల గుర్తింపు  విమానం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025