NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kumbh Mela: కుంభమేళాకు వెళ్లే తెలంగాణ, ఏపీ భక్తులకు బ్యాడ్ న్యూస్!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Kumbh Mela: కుంభమేళాకు వెళ్లే తెలంగాణ, ఏపీ భక్తులకు బ్యాడ్ న్యూస్!
    కుంభమేళాకు వెళ్లే తెలంగాణ, ఏపీ భక్తులకు బ్యాడ్ న్యూస్!

    Kumbh Mela: కుంభమేళాకు వెళ్లే తెలంగాణ, ఏపీ భక్తులకు బ్యాడ్ న్యూస్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 20, 2025
    12:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన 'కుంభమేళా' కు వెళ్లాలని భావించిన భక్తులకు రైల్వే బోర్డు భారీ షాక్ ఇచ్చింది.

    సికింద్రాబాద్ నుంచి ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్, కాశీ నగరాల మీదుగా బీహార్‌కు వెళ్లే దానాపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఫిబ్రవరి 20 నుంచి 28 వరకు, మొత్తం తొమ్మిది రోజుల పాటు రద్దు చేసింది.

    ఈ రద్దుతో భక్తుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. బుధవారం బయల్దేరాల్సిన దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు మంగళవారం రాత్రే రైల్వే బోర్డు ప్రకటించింది.

    ఇప్పుడు ఏకంగా నెలాఖరు వరకు ఈ రైలును నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.

    Details

    నిరాశలో భక్తులు

    ఇటార్సి-ప్రయాగ్‌రాజ్ మార్గంలో నిత్యం వందల రైళ్లు నడుస్తున్నా సికింద్రాబాద్ నుంచి వెళ్లే ఏకైక రెగ్యులర్ రైలును రద్దు చేయడం వివాదాస్పదంగా మారింది.

    ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో కుంభమేళా ముగియనుండటంతో రైల్వే నిర్ణయం భక్తులను తీవ్రంగా నిరాశపరిచింది.

    రోడ్డు, వాయు మార్గాల్లో ప్రయాణించే వీలు లేకపోవడంతో 36,000 మందికి పైగా ప్రయాణికులు ముందుగా టికెట్లు బుక్ చేసుకున్నా రైలు రద్దుతో భక్తులు నిరాశచెందారు.

    Details

    ప్రత్యామ్నాయంగా ప్రత్యేక రైళ్లు, కానీ

    సికింద్రాబాద్-దానాపూర్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్ రద్దు చేసిన రైల్వే బోర్డు, ఫిబ్రవరి 20 నుంచి 28 వరకు చర్లపల్లి-దానాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

    అయితే ఈ రైళ్లు నల్గొండ, విజయవాడ, భువనేశ్వర్, పట్నా మీదుగా దానాపూర్‌కు వెళతాయి

    కానీ, ప్రయాగ్‌రాజ్, కాశీ నగరాలను కవర్ చేయవు. దీంతో భక్తులకు ప్రయాణం మరింత సంక్లిష్టంగా మారింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    భారతదేశం

    India-China: గస్తీ ఒప్పందం కుదుర్చుకున్న వేళ.. భారత్-చైనా రక్షణ మంత్రులు భేటీ రాజ్‌నాథ్ సింగ్
    Rents surge: ఢిల్లీతో సహా 7 ప్రధాన భారతీయ నగరాల్లో 70% పెరిగిన అద్దెలు  భారతదేశం
    Cop conference: అభివృద్ధి చెందిన దేశాలు ముందుకు రావాలి.. భారత్‌ హెచ్చరిక ప్రపంచం
    Hydrogen Train : భారత్‌లో తొలి హైడ్రోజన్‌ రైలు.. ట్రయల్‌ రన్‌ ప్రారంభం  రైల్వే బోర్డు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025