NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బీబీసీ డాక్యుమెంటరీ: గాడ్సేపై వస్తున్న సినిమాను కేంద్రం అడ్డుకుంటుందా?: ఒవైసీ
    తదుపరి వార్తా కథనం
    బీబీసీ డాక్యుమెంటరీ: గాడ్సేపై వస్తున్న సినిమాను కేంద్రం అడ్డుకుంటుందా?: ఒవైసీ
    గాంధీని హత్య చేసిన గాడ్సేపై వస్తున్న సినిమాను అడ్డుకుంటారా: ఒవైసీ

    బీబీసీ డాక్యుమెంటరీ: గాడ్సేపై వస్తున్న సినిమాను కేంద్రం అడ్డుకుంటుందా?: ఒవైసీ

    వ్రాసిన వారు Stalin
    Jan 23, 2023
    11:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుతం భారత ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వీడియోకు సబంధించిన యూట్యూబ్ లింకులను కేంద్రం భ్యాన్ చేయడంపై జాతీయస్థాయిలో రాజకీయ దుమారం రేగుతోంది. కేంద్రం తీసుకున్న చర్యపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.

    తాజాగా దీనిపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. బీబీసీ డాక్యుమెంటరీని అడ్డుకున్న కేంద్ర ప్రభుత్వం, మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సేపై వస్తున్న సినిమాను కూడా అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు.

    బ్రిటీష్ చట్టాల ఆధారంగానే దేశంలో ట్విట్టర్, యూట్యూబ్‌లో డాక్యుమెంటరీ లింకులను బ్యాన్ చేసినట్లు ఆయన గుర్తు చేశారు. గుజరాత్ అల్లర్ల సమయంలో ఎవరైనా అంతరిక్షం నుంచి వచ్చి ప్రజలను చంపారా? అని ఆయన ప్రశ్నించారు.

    ఒవైసీ

    గాంధీని హత్య చేసిన గాడ్సేపై కేంద్రం వైఖరి చెప్పాలి: ఒవైసీ

    గాంధీని హత్య చేసిన గాడ్సేపై కేంద్రం, బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. గాడ్సేపై తీస్తున్న సినిమాను ప్రధాని మోదీ బ్యాన్ చేస్తారా? దమ్ముంటే గాడ్సే సినిమాపై నిషేధం విధించాలని బీజేపీకి సవాల్ విసిరారు.

    గాంధీ వర్ధంతి అయిన జనవరి 30వరకు గాడ్సే సినిమా విడదుల కాకుండా నిషేధించాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. 'గాంధీ గాడ్సే' పేరుతో చిత్రీకరించిన సినిమా జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల కానుంది.

    బీబీసీ డాక్యుమెంటరీపై టీఎంసీ కూడా స్పందించింది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ చక్రవర్తి, ఆ పార్టీ సభ్యులు అభద్రతతో ఉండటం సిగ్గుచేటని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మండిపడ్డారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రధాన మంత్రి
    నరేంద్ర మోదీ

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ప్రధాన మంత్రి

    ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి' ఉక్రెయిన్
    ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ నరేంద్ర మోదీ
    కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా? చంద్రబాబు నాయుడు
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్ గుజరాత్
    టార్గెట్ 2024: కేంద్ర మంత్రివర్గం, బీజేపీలో భారీ మార్పులకు మోదీ స్కెచ్ భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    బడ్జెట్ టారిఫ్ తో రఘురాం రాజన్ ను భయపెడుతున్న మోడీ ప్రభుత్వం ఆర్ బి ఐ
    పెద్ద నోట్ల రద్దు.. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025