NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bhadrachalam: భద్రాచలం రాముల వారి కల్యాణం.. వారికి ఉచిత ప్రవేశం!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Bhadrachalam: భద్రాచలం రాముల వారి కల్యాణం.. వారికి ఉచిత ప్రవేశం!
    భద్రాచలం రాముల వారి కల్యాణం.. వారికి ఉచిత ప్రవేశం!

    Bhadrachalam: భద్రాచలం రాముల వారి కల్యాణం.. వారికి ఉచిత ప్రవేశం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 17, 2025
    12:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రామాలయంలో ప్రతేడాది శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు.

    రాముల వారి కల్యాణం, లోక కల్యాణంగా భావించబడటంతో ఈ పవిత్ర వేడుకను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో భద్రాచలం చేరుకుంటారు.

    ప్రత్యేకంగా మిథిలా స్టేడియంలో జరిగే ఈ వేడుకకు టికెట్ల కోసం భక్తులు పోటీ పడుతుంటారు. అయితే ఈసారి భక్తుల కోసం ప్రత్యేక ఆఫర్ అందుబాటులోకి వచ్చింది.

    Details

    దాతలకు ఉచిత టికెట్లు 

    ఈ ఏడాది ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు.

    ఈ ఉత్సవాలను మరింత వైభవంగా చేయడానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

    ఈ సందర్భంగా భద్రాచలం దేవస్థానానికి రూ.50 లక్షలకుపైగా విరాళం అందించిన భక్తులకు ఉచితంగా రెండు కల్యాణం టికెట్లు ఇవ్వనున్నట్లు దేవస్థానం ఈవో రమాదేవి ప్రకటించారు.

    ఈ విరాళం అందించిన భక్తుల కోసం ప్రత్యేకంగా ఒక సెక్టార్‌ను ఏర్పాటుచేయనున్నారు.

    భక్తులు మార్చి 26లోపు రూ.50 లక్షల విరాళం ఇచ్చినట్టు ధృవీకరించేందుకు దేవస్థానంలో లేఖ సమర్పించాలని ఈవో సూచించారు.

    Details

     భద్రాచలం దేవస్థానం గదుల బుకింగ్‌ నిలిపివేత 

    ఏప్రిల్ 6న జరిగే రాముల వారి కల్యాణం సందర్భంగా ఏప్రిల్ 4 నుంచి 7వ తేదీ వరకు దేవస్థానం కాటేజీలు, గదులను భక్తులకు కేటాయించకూడదని నిర్ణయించారు.

    బుకింగ్‌ కూడా అందుబాటులో ఉండదని, భక్తులు ఈ విషయాన్ని ముందుగా గమనించాలని ఈవో రమాదేవి కోరారు.

    ముత్యాల తలంబ్రాల విరాళం

    ఈ సందర్భంగా తెలంగాణ ఎండోమెంట్ ట్రిబ్యునల్ చైర్మన్, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి మండా వెంకటేశ్వరరావు భద్రాచల సీతారాముల కల్యాణానికి రూ.13 వేల విలువైన 500 గ్రాముల ముత్యాల తలంబ్రాలను దేవస్థాన ఈవోకు అందజేశారు.

    ఈ విధంగా భక్తుల అద్భుత ఆరాధనతో, విరాళాల తోడుతో భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు దేవస్థానం సిద్ధమవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భద్రాచలం

    తాజా

    Balochistan: క్వెట్టాను ఆధీనంలోకి తీసుకున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. పారిపోయిన పాకిస్థాన్ సైన్యం పాకిస్థాన్
    Adani & Ambani: 'దేశ సాయుధ బలగాలకు అండగా ఉంటాం'.. అదానీ, అంబానీ  గౌతమ్ అదానీ
    Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను CJCSC అరెస్టు..?  పాకిస్థాన్
    Karachi port:1971 తర్వాత కరాచీ ఓడరేవుపై మళ్లీ భారత నావికాదళం దాడులు  పాకిస్థాన్

    భద్రాచలం

    తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద ఉద్ధృత ప్రవాహం, పోలవరానికి పెరుగుతున్న నీటిమట్టం గోదావరి నదీ
    భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. భయాందోళనలో ప్రజలు  భూకంపం
    Bhadrachalam: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ భారతదేశం
    Bhadrachalam: భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025