NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bharat Jodo Nyay Yatra: నేటి నుంచి రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' 
    తదుపరి వార్తా కథనం
    Bharat Jodo Nyay Yatra: నేటి నుంచి రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' 
    Bharat Jodo Nyay Yatra: నేడు నుంచి రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'

    Bharat Jodo Nyay Yatra: నేటి నుంచి రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' 

    వ్రాసిన వారు Stalin
    Jan 14, 2024
    08:46 am

    ఈ వార్తాకథనం ఏంటి

    2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమి, ఇండియా కూటమి గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సన్నద్ధమయ్యారు.

    'భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)' ఆదివారం (జనవరి 14) ప్రారంభం కానుంది.

    మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా నుంచి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మధ్యాహ్నం 12:00 గంటలకు జెండా ఊపి ప్రారంభించనున్నారు.

    ఈ యాత్ర దాదాపు 6,713 కిలోమీటర్ల పాటు కొనసాగనుంది. రాహుల్ గాంధీతో పాటు మరో 60-70 మంది ఈ యాత్రలో రాహుల్‌తో పాటు నడవనున్నారు.

    'భారత్ జోడో న్యాయ్ యాత్ర' 2024 ఏప్రిల్-మేలో లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మార్చి 20న ముగియనుంది.

    రాహుల్

    అనుమతి నిరాకరించిన ఎన్.బీరెన్‌సింగ్ ప్రభుత్వం

    వాస్తవానికి 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.

    రాష్ట్రంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎన్.బీరెన్‌సింగ్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.

    చివరికి పరిమిత సంఖ్యలో నాయకులు పాల్గొనే తౌబాల్ జిల్లా నుంచి 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతించింది.

    ఇది వరకే రాహుల్ గాంధీ కన్యాకుమారి -కాశ్మీర్ వరకు 'భారత్ జోడో యాత్ర' పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే.

    మొదటి దఫా నిర్వహించిన 'భారత్ జోడో యాత్ర'కు విశేష స్పందన వచ్చింది.

    దాదాపు 3,500 కి.మీ 'భారత్ జోడో యాత్ర' 12 రాష్ట్రాల గుండా సాగింది. ఈ యాత్ర వల్ల ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నెలకొంది.

    రాహుల్

    15 రాష్ట్రాల్లో న్యాయ్ యాత్ర 

    'భారత్ జోడో న్యాయ్ యాత్ర' తూర్పు భారత నుంచి నుంచి పడమర వరకు 15 రాష్ట్రాల్లో ఇది సాగనుంది.

    'భారత్ జోడో యాత్ర' కంటే దాదాపు రెట్టింపు దూరం న్యాయ్ యాత్ర ఉంటుంది. మణిపూర్ నుంచి ముంబై వరకు రాహుల్ గాంధీ 67రోజుల వ్యవధిలో 15రాష్ట్రాల్లోని 110జిల్లాల గుండా వెళతారు.

    గత 10ఏళ్లలో జరిగిన రాజకీయ, ఆర్థిక, సామాజిక అన్యాయాలను ఈ యాత్ర ద్వారా ఎండగట్టనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు.

    'న్యాయ్ యాత్ర' దేశంలోని మొత్తం పార్లమెంటరీ సీట్లలో 65శాతం ఉన్న 355లోక్‌సభ స్థానాలను కవర్ చేస్తుంది.

    2019లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 355 స్థానాలకు గాను 236 స్థానాలను బీజేపీ గెలుచుకోగా, కాంగ్రెస్ 14 మాత్రమే గెలుచుకోగలిగింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ గాంధీ
    కాంగ్రెస్
    భారత్ జోడో యాత్ర
    మణిపూర్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    రాహుల్ గాంధీ

    Rahul Gandhi: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలోకి రాహుల్ గాంధీ కాంగ్రెస్
    2024లో మరోసారి అమేథీ బరిలో దిగనున్న రాహుల్.. ప్రకటించిన యూపీ కాంగ్రెస్ చీఫ్ భారతదేశం
    పాంగాంగ్ సరస్సుకు రాహుల్ గాంధీ బైక్ రైడ్; స్టైలిష్ లుక్‌లో కాంగ్రెస్ నేత  లద్దాఖ్
    Rahul Gandhi: చైనా చొరబాటుపై రాహుల్ విమర్శలు; రాజీవ్ గాంధీకి లద్దాఖ్‌లో నివాళులు లద్దాఖ్

    కాంగ్రెస్

    Congress Victory factors: తెలంగాణలో కాంగ్రెస్ గెలుపునకు దోహదపడ్డ 6 కీలక అంశాలు ఇవే..  తెలంగాణ
    Congress: నేడు కొలువుదీరనున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. సీఎంగా రేవంత్ రెడ్డి!  తెలంగాణ
    Congress: కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎంపిక బాధ్యత ఏఐసీసీకి అప్పగింత ముఖ్యమంత్రి
    Congress: ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి ప్రభావం 'ఇండియా'లో కూటమిలో సీట్ల పంపకంపై ఉంటుందా? ఇండియా

    భారత్ జోడో యాత్ర

    రాహుల్ గాంధీని చంపుతానని బెదిరించిన వ్యక్తి అరెస్టు  రాహుల్ గాంధీ
    సెప్టెంబర్ 7న ప్రతి జిల్లాలో 'భారత్ జోడో యాత్ర'కు పిలుపునిచ్చిన కాంగ్రెస్  కాంగ్రెస్
    వచ్చే ఎన్నికల్లో దేశానికి నాయకత్వం వహించేది రాహుల్ గాంధీ: కాంగ్రెస్  రాహుల్ గాంధీ

    మణిపూర్

    మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింసాకాండ.. తెల్లవారుజామున కాల్పుల్లో ముగ్గురు మృతి భారతదేశం
    జీ20 ఈవెంట్‌ను మణిపూర్‌లో ఎందుకు నిర్వహించడం లేదు: అఖిలేష్ యాదవ్  జీ20 సమావేశం
    Manipur violence: మణిపూర్‌ హింసపై సుప్రీంకోర్టుకు నివేదికను సమర్పించిన జస్టిస్ మిట్టల్ కమిటీ సుప్రీంకోర్టు
    మణిపూర్ దుస్థితికి కాంగ్రెస్సే కారణమన్న బీరెన్ సింగ్.. సీఎం రాజీనామాకు సీపీఐ పట్టు  బీరెన్ సింగ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025