NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: మా వాటాను 41% నుంచి 50% పెంచండి.. 16వ ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో డిప్యూటీ సీఎం
    తదుపరి వార్తా కథనం
    Telangana: మా వాటాను 41% నుంచి 50% పెంచండి.. 16వ ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో డిప్యూటీ సీఎం
    మా వాటాను 41% నుంచి 50% పెంచండి

    Telangana: మా వాటాను 41% నుంచి 50% పెంచండి.. 16వ ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో డిప్యూటీ సీఎం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 10, 2024
    11:50 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సహాయం అందించాలని ప్రజాభవన్ లో జరుగుతున్న 16వ ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో డిప్యూటీ సీఎం,ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు.

    పన్నుల ద్వారా వచ్చే ఆదాయ వాటాను 41% నుండి 50% వరకు పెంచాలని సూచించారు.

    రైతు భరోసా,రైతు రుణమాఫీ రాష్ట్రానికి అత్యంత అవసరమైనవి అని చెప్పారు.ఈ విధానాలు ప్రజలకు ఆర్థిక భరోసా,అధిక భద్రతను అందిస్తాయని పేర్కొన్నారు.

    కేంద్ర పథకాలను అమలు చేయడానికి తరచూ కఠినమైన నిబంధనలు ఉంచడం వల్ల రాష్ట్రాలు అవరోధాలను ఎదుర్కొంటున్నాయని అన్నారు.

    రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా కేంద్ర పథకాలను రూపొందించడానికి స్వాతంత్యాన్ని అందించాలని సూచించారు.

    తెలంగాణ రాష్ట్రం ప్రస్తుత కీలక దశలో ఉన్నది,మరింత వేగంగా అభివృద్ధి సాధించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

    వివరాలు 

    6.85 లక్షల కోట్ల పైగా రుణభారం

    గత ఆర్థిక సంవత్సరానికి ముగిసే సమయానికి,రాష్ట్రం 6.85 లక్షల కోట్ల పైగా రుణభారం కింద ఉందని వివరించారు.

    సెస్‌లు,సర్ చార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని అభ్యర్థించారు.స్థూల పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటా తక్కువగా ఉన్నదని పేర్కొన్నారు.

    సంక్షేమ కార్యక్రమాలను బలోపేతం చేయడం,మౌలిక సదుపాయాలు అందించడం ద్వారా సమాజంలోని అంతరాలను పరిష్కరించవచ్చని తెలిపారు.

    ఇది తెలంగాణకు మాత్రమే కాకుండా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అంశమని అన్నారు.

    తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అని,చారిత్రిక కారణాల వల్ల అసమాన అభివృద్ధి ఉందని చెప్పారు.

    తలసరి ఆదాయం ఎక్కువ అయినప్పటికీ,సంపద,ఆదాయంలో భారీ అంతరాన్నిపేర్కొని, ఈ అసమానతల కారణంగా రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభమయ్యిందని గుర్తుచేశారు.

    సమానతను సాధించేందుకు మౌలిక సదుపాయాలు,సంక్షేమ రంగంపై మరింత ఖర్చు చేయాల్సి ఉందని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మల్లు భట్టి విక్రమార్క

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    మల్లు భట్టి విక్రమార్క

    Bhatti Vikramarkha : ప్రజాభవన్‌లో కుటుంబసమేతంగా ఉపముఖ్యమంత్రి పూజలు.. అధికార నివాసంలోకి అడుగుపెట్టిన భట్టి విక్రమార్కEmbed హైదరాబాద్
    Telangana Budget: నేడు అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రి భట్టి  తెలంగాణ
    Telangana Budget: తెలంగాణ బడ్జెట్ @ రూ.2,75,891 కోట్లు.. ఆరు గ్యారంటీలకు భారీగా కేటాయింపులు తెలంగాణ
    Telangana: తెలంగాణలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: భట్టి  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025