NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bhatti Vikramarka: దేశంలో మొట్టమొదటిసారి రైతు రుణమాఫీ చేసిన ప్రధాని మన్మోహన్ సింగ్..
    తదుపరి వార్తా కథనం
    Bhatti Vikramarka: దేశంలో మొట్టమొదటిసారి రైతు రుణమాఫీ చేసిన ప్రధాని మన్మోహన్ సింగ్..
    దేశంలో మొట్టమొదటిసారి రైతు రుణమాఫీ చేసిన ప్రధాని మన్మోహన్ సింగ్..

    Bhatti Vikramarka: దేశంలో మొట్టమొదటిసారి రైతు రుణమాఫీ చేసిన ప్రధాని మన్మోహన్ సింగ్..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 30, 2024
    11:36 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో మొదటిసారి రైతు రుణమాఫీని అమలు చేసిన ప్రధాని, నేడు రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ పథకానికి స్ఫూర్తి ఇచ్చిన మన్మోహన్ సింగ్ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

    ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో,మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు సంతాపం,అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాదులో మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.

    మన్మోహన్ సింగ్ దేశంలోని అసమానతలను పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నాలు గొప్పవని, ఆయన అరుదైన వ్యక్తి అని కొనియాడారు.

    సమాచార హక్కు చట్టం, తదితర చట్టాలను తీసుకువచ్చిన ఘనత కూడా ఆయనదేనని తెలిపారు.

    వివరాలు 

    ఆర్థిక, సామాజిక పరిస్థితులపై దృష్టి

    "ఎందరో వస్తారు, కానీ కొందరే ఈ భూమిపై మానవీయ పరిమళాలను వెదజల్లుతారు.

    అందులో మన్మోహన్ సింగ్ ఒకరు." తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అవసరమైన మద్దతు లేకపోయినా, ప్రతిపక్షాలను ఒప్పించి, సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ తెలంగాణ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసిన విధానం మరిచిపోలేని ఘనత అన్నారు.

    ఆయన ప్రతి పదవిలో కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకొని దేశం ఆర్థిక, సామాజిక పరిస్థితులపై దృష్టి పెట్టి అనేక చట్టాలు ప్రవేశపెట్టారని అన్నారు.

    వివరాలు 

    స్కావెంజర్స్ చట్టం రద్దు

    సామాన్యులకు సమాచారాన్ని అందించే సమాచార హక్కు చట్టాన్ని, ఉపాధి హామీ పథకాన్ని, ఆర్థిక సంక్షోభ సమయంలో ప్రజల్ని కాపాడే చట్టాలను మన్మోహన్ సింగ్ తెచ్చారని పేర్కొన్న భట్టి విక్రమార్క, అటవీ హక్కు చట్టం, భూ సేకరణ చట్టం ద్వారా కూడా దేశ ప్రజల హక్కులను పరిరక్షించినట్లు చెప్పారు.

    అదేవిధంగా, స్కావెంజర్స్ చట్టాన్ని రద్దు చేసి వారికి భద్రత కల్పించి, ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గౌరవాన్ని పెంచారని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మల్లు భట్టి విక్రమార్క
    మన్మోహన్ సింగ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    మల్లు భట్టి విక్రమార్క

    Bhatti Vikramarkha : ప్రజాభవన్‌లో కుటుంబసమేతంగా ఉపముఖ్యమంత్రి పూజలు.. అధికార నివాసంలోకి అడుగుపెట్టిన భట్టి విక్రమార్కEmbed హైదరాబాద్
    Telangana Budget: నేడు అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రి భట్టి  తెలంగాణ
    Telangana Budget: తెలంగాణ బడ్జెట్ @ రూ.2,75,891 కోట్లు.. ఆరు గ్యారంటీలకు భారీగా కేటాయింపులు తెలంగాణ
    Telangana: తెలంగాణలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: భట్టి  భారతదేశం

    మన్మోహన్ సింగ్

    భారత్ సరైన పనే చేసింది: రష్యా-ఉక్రెయిన్ వివాదం తర్వాత కేంద్రం వైఖరికి మాజీ ప్రధాని మద్దతు   జీ20 సదస్సు
    Manmohasingh: మన్మోహన్ సింగ్ కు ముగిసిన రాజ్యసభ పదవీకాలం...హీరోగా మిగిలిపోయారన్న మల్లికార్జునఖర్గే మల్లికార్జున ఖర్గే
    Modi Fire-Congress: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మీ సంపద గోవిందా...కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Manohansingh On Modi: ప్రసంగాలతో ప్రధాని గౌరవాన్ని తగ్గించిన తొలి ప్రధాని మోదీ: మన్మోహన్ సింగ్   నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025