NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: ఇంటర్ విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఒక్క సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయినవారికి మరో అవకాశం!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Telangana: ఇంటర్ విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఒక్క సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయినవారికి మరో అవకాశం!
    ఇంటర్ విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఒక్క సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయినవారికి మరో అవకాశం!

    Telangana: ఇంటర్ విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఒక్క సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయినవారికి మరో అవకాశం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 09, 2025
    01:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రాసిన దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల ఆన్సర్ షీట్లను పూర్తిగా రీ వాల్యుయేట్ చేయడం సాధ్యం కాదని ఇంటర్ బోర్డు అధికారులు భావించారు.

    అందులో భాగంగా విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా ఐదు రకాల స్లాట్లలో ర్యాండమ్ చెకింగ్‌ చేపట్టనున్నారు.

    ఈ క్రమంలో జీరో మార్కులు, 1-10 మార్కులు, 25-35, 60-70, 95-99 మార్కుల మధ్య ర్యేంజ్‌లో ఉన్న ఆన్సర్ షీట్లను ఎంపిక చేసి రీ వాల్యుయేషన్‌ చేయనున్నారు.

    రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 19 స్పాట్ కేంద్రాల్లో మంగళవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది.

    మూడురోజుల పాటు సాధారణ రీ వాల్యుయేషన్‌ పూర్తయిన తర్వాత మరో మూడు రోజులు ర్యాండమ్ చెకింగ్ జరుగనుంది.

    Details

    ఈనెల 25లోగా ఫలితాలు

    అంతేకాకుండా అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులతో పాసై, ఒకే సబ్జెక్టులో ఫెయిలైన విద్యార్థుల ఆన్సర్ షీట్లను కూడా ప్రత్యేకంగా మళ్లీ చెక్ చేస్తున్నారు.

    ఒక ఉదాహరణగా ఒక విద్యార్థికి మొదట 33 మార్కులు రాగా, రీ వాల్యుయేషన్‌లో 36 మార్కులు వచ్చినట్టు ఓ క్యాంప్ ఆఫీసర్ తెలిపారు.

    ఈ పేపర్‌ను ఓ ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ వాల్యుయేట్ చేసినట్టు గుర్తించారన్నారు. ఈ రీ వాల్యుయేషన్ నిర్ణయం వల్ల కొందరి మార్కుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

    ఈ నెల 25లోగా ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.

    Details

    తప్పుల నివారణ కోసం రీ వాల్యుయేషన్‌: జయప్రద బాయి

    ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు సీఓఈ జయప్రద బాయి మాట్లాడుతూ, వాల్యుయేషన్ ప్రక్రియలో అనుకోకుండా జరిగే తప్పుల నివారణ కోసమే ఈ రీ వాల్యుయేషన్‌ చేపడుతున్నట్లు తెలిపారు.

    విద్యార్థుల హక్కులను కాపాడేందుకు, వారి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని బోర్డు సెక్రటరీ ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు.

    ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయినవారి పేపర్లు కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తున్నామని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ఇంటర్

    తాజా

    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్

    తెలంగాణ

    Betting Apps Promotion: బెట్టింగ్ యాప్ విచారణ కేసులో ఊహించని ట్విస్ట్.. సంస్థలపైకి దృష్టి భారతదేశం
    Telangana cabinet: మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ .. ఈ విడతలో నలుగురికి అవకాశం? భారతదేశం
    SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..! భారతదేశం
    BYD cars: తెలంగాణకు బీవైడీ.. హైదరాబాద్‌ సమీపంలో విద్యుత్తు కార్ల యూనిట్‌ ఆటోమొబైల్స్

    ఇంటర్

    Inter Exams : ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్ ఖరారు..పదో తరగతి పరీక్షలు ఎప్పుడంటే తెలంగాణ
    Student suicide: ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య.. కుటుంబ సభ్యుల ఆందోళన  ఆత్మహత్య
    TSBIE- 2024: తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి  విద్యార్థులు
    Andhra Pradesh -Inter Result:త్వరలో ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025