NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: 'పరిశ్రమ 4.0' పేరుతో ఎంఎస్‌ఎంఈలకు భారీ ఊరట.. పెట్టుబడులకు అవకాశాలు 
    తదుపరి వార్తా కథనం
    Telangana: 'పరిశ్రమ 4.0' పేరుతో ఎంఎస్‌ఎంఈలకు భారీ ఊరట.. పెట్టుబడులకు అవకాశాలు 
    'పరిశ్రమ 4.0' పేరుతో ఎంఎస్‌ఎంఈలకు భారీ ఊరట.. పెట్టుబడులకు అవకాశాలు

    Telangana: 'పరిశ్రమ 4.0' పేరుతో ఎంఎస్‌ఎంఈలకు భారీ ఊరట.. పెట్టుబడులకు అవకాశాలు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 18, 2024
    11:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూలస్థంభాలుగా ఉన్న విషయం తెలిసిందే.

    ఈ రంగంలో ఎంఎస్‌ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం 'పరిశ్రమ 4.0' పేరిట కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో ఈ విధానం అమలుకు తెర తీసింది.

    ఈ కొత్త పాలసీతో ఎంఎస్‌ఎంఈలకు పెట్టుబడులు సులభతరమవుతాయని, రాష్ట్రంలో పారిశ్రామిక రంగం మరింత బలోపేతం అవుతుందని ప్రభుత్వం ధృడంగా నమ్ముతోంది.

    Details

    33 సంవత్సరాలు స్థలాన్నిలీజ్ కు తీసుకొనే అవకాశం

    ఈ కొత్త విధానంలో, ఎంఎస్‌ఎంఈలు స్థాపించడానికి అవసరమైన స్థలాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం ఇకపై లేకుండా, లీజు పద్ధతిని ప్రవేశపెట్టారు.

    ఈ లీజు వ్యవస్థలో పరిశ్రమలు 33 సంవత్సరాల పాటు స్థలాన్ని లీజుకు తీసుకుని, ప్రణాళిక ప్రకారం పరిశ్రమలను స్థాపించుకోవచ్చు.

    ఈ విధానం ద్వారా పరిశ్రమలపై పెట్టుబడి భారాన్ని తగ్గించుకోవచ్చు.

    స్థల కొనుగోలుకు అవసరమైన డబ్బును ఇతర అవసరాల కోసం వినియోగించుకోవచ్చు.

    Details

     లీజ్ పద్ధతిలో భవనాలు  

    ఎంఎస్‌ఎంఈలకు భవనాలను కూడా లీజు పద్ధతిలో ఇవ్వాలని ఈ విధానంలో పేర్కొన్నారు.

    ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ భవనాలను నిర్మించి పరిశ్రమలకు అద్దెకు ఇవ్వడం ద్వారా పారిశ్రామికవేత్తలు భవన నిర్మాణం కోసం పెట్టుబడి ఖర్చు తగ్గించుకోగలరు.

    లీజు తీసుకున్న పరిశ్రమలు, నిర్దేశిత గడువులోగా తమ కార్యకలాపాలను ప్రారంభించకపోతే, ప్రభుత్వం ఆ భూములు, భవనాలను తిరిగి స్వాధీనం చేసుకునే అధికారాన్ని కల్పించింది.

    Details

    మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కృషి

    ఎంఎస్‌ఎంఈ పార్క్‌లలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సామాజిక వసతులు ఏర్పాటు చేయాలని కూడా కొత్త పాలసీలో ప్రస్తావించారు.

    పార్క్‌లలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, చిన్న పిల్లల సంరక్షణ కేంద్రాలు, కార్మికుల నివాస గదులు వంటి సౌకర్యాలు కల్పిస్తారు.

    మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు, ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక మహిళా పారిశ్రామికవాడను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద మహిళలకు ప్రత్యేక అవకాశాలు కల్పించి, పారిశ్రామిక రంగంలో సత్తా చాటేందుకు ఈ వేదికగా మారనుంది.

    Details

    కొత్త పాలసీ అమలుతో సమస్యలు పరిష్కరం

    ప్రస్తుత ప్రభుత్వం పరిశ్రమలకు ఇవ్వాల్సిన రూ. 3,736 కోట్ల ప్రోత్సాహక బకాయిల చెల్లింపుపై కూడా దృష్టి పెట్టింది.

    ఇందులో రూ. 3,008 కోట్లు ఎంఎస్‌ఎంఈలకు, రూ. 728 కోట్లు భారీ పరిశ్రమలకు సంబంధించినవి.

    గత ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించినప్పటికీ, వీటి విడుదల కాకపోవడంతో సమస్య తలెత్తింది.

    కొత్త పాలసీ అమలుతో ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రచిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    రేవంత్ రెడ్డి

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    తెలంగాణ

    Telangana: యువతా మేలుకో.. ఓటు నమోదు చేసుకో భారతదేశం
    Telangana: తెలంగాణ రైతుల కోసం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. రైతుబీమాకు యాప్‌  భారతదేశం
    Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన.. ఇప్పటినుండి వారికీ  ఉచిత విద్యుత్   మల్లు భట్టి విక్రమార్క
    Telangana Congress: తెలంగాణ  పీసీసీ చీఫ్ గా మహేశ్‌ కుమార్‌గౌడ్‌ భారతదేశం

    రేవంత్ రెడ్డి

    Revanth Reddy : రాజ్‌భవన్‌లో గవర్నర్‌ రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యిన రేవంత్‌రెడ్డి భారతదేశం
    Days After Oath: చంద్రబాబు, రేవంత్ పెండింగ్ సమస్యలపై కీలక భేటీ  చంద్రబాబు నాయుడు
     ప్రధాని మోదీతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి భేటీ  భట్టి విక్రమార్క మల్లు
    Strategy to silence BRS : BRS నేతల నోటికి తాళం.. వ్యూహాత్మకంగా కాంగ్రెస్ అడుగులు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025