NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / లాఠీఛార్జ్ లో మరణించిన బీజేపీ కార్యకర్త.. టీచర్ల పోస్టింగ్స్ నిరసన ర్యాలీలో ఉద్రిక్తత
    తదుపరి వార్తా కథనం
    లాఠీఛార్జ్ లో మరణించిన బీజేపీ కార్యకర్త.. టీచర్ల పోస్టింగ్స్ నిరసన ర్యాలీలో ఉద్రిక్తత
    పాట్నాలో బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్.. ఉద్రిక్తతలకు దారితీసిన టీచర్ల పోస్టింగ్స్

    లాఠీఛార్జ్ లో మరణించిన బీజేపీ కార్యకర్త.. టీచర్ల పోస్టింగ్స్ నిరసన ర్యాలీలో ఉద్రిక్తత

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 13, 2023
    04:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బిహార్ రాజధాని పాట్నలో రాజకీయ అలజడులు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ మేరకు బీజేపీ శ్రేణులపై పోలీసులు జరిపిన లాఠిఛార్జ్ లో ఓ కార్యకర్త మరణించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అగ్గిరాజుకుంది.

    రాష్ట్రంలో టీచర్ల పోస్టింగులపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష బీజేపీ నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది.

    బిహార్ ముఖ్యమంత్రి నీతిశ్ కుమార్ కు వ్యతిరేకంగా బారతీయ జనతా పార్టీ శ్రేణులు విధాన సభ మార్చ్ ను నిర్వహించాయి. ఈ నేపథ్యంలోనే నిరసనగా అసెంబ్లీకి ర్యాలీగా బయల్దేరాయి.

    సదరు ర్యాలీకి అనుమతులు లేవని, పోలీసులు అడ్డుకున్నారు. తాము అసెంబ్లీకి శాంతియుతంగానే ర్యాలీగా తరలివెళ్తామని బీజేపీ కార్యకర్తలు తేల్చిచెప్పారు.

    ఈ క్రమంలో కాషాయ దళాలను చెదరగొట్టేందుకు వాటర్ క్యానన్లు ప్రయోగించారు.

    DETAILS

    భూ కుంభకోణంలో తేజస్వి యాదవ్‌ పేరుతో ఆందోళనలు ఉద్ధృతం

    అనంతరం మరో మెట్టు పెంచుతూ ఏకంగా లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే రాజధాని పాట్నాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

    జూలై 3న భూ కుంభకోణంలో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ పేరును సీబీఐ చార్జిషీట్‌లో చేర్చింది. అప్పట్నుంచి ఆందోళనలను బీజేపీ మరింత ఉద్ధృతం చేసింది.

    ఇప్పుడు తాజాగా టీచర్ల పోస్టింగ్స్ అంశంపై నిరసన తెలియజేసేందుకు ప్రయత్నించింది.

    తమపై ఎన్నిసార్లు లాఠీ ప్రయోగించినా నితీష్ కుమార్ సర్కారుకు వ్యతిరేకంగా పోరాడతామని బీహార్ ప్రతిపక్ష నేత సామ్రాట్ చౌదరి స్పష్టం చేశారు.

    ముఖ్యమంత్రి నితీష్‌ రాష్ట్రాన్ని గూండాల రాజ్యంగా మార్చుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తమపై లాఠీఛార్జ్‌ చేయిస్తున్నారని మండిపడ్డారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బిహార్
    భారతీయ జనతా పార్టీ/బీజేపీ

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    బిహార్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    Dream11 jackpot: రూ.49తో బెట్టింగ్ పెట్టి.. కోటీశ్వరుడైన డీజే వర్కర్ భారతదేశం
    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    ఇండిగో విమానంలో మందుబాబుల రచ్చ.. ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులు దిల్లీ

    భారతీయ జనతా పార్టీ/బీజేపీ

    'బీజేపీ నాకు గురువులాంటింది'.. కమలం పార్టీపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు భారత జాతీయ కాంగ్రెస్/కాంగ్రెస్ పార్టీ
    టార్గెట్ 2024: కేంద్ర మంత్రివర్గం, బీజేపీలో భారీ మార్పులకు మోదీ స్కెచ్ నరేంద్ర మోదీ
    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ అమిత్ షా
    అదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా అమిత్ షా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025