NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / స్టార్టప్‌తో రిక్షా పుల్లర్ అద్భుతం; ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలిస్తున్నాడు
    తదుపరి వార్తా కథనం
    స్టార్టప్‌తో రిక్షా పుల్లర్ అద్భుతం; ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలిస్తున్నాడు
    స్టార్టప్‌తో రిక్షా పుల్లర్ అద్భుతం; ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలిస్తున్నాడు

    స్టార్టప్‌తో రిక్షా పుల్లర్ అద్భుతం; ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలిస్తున్నాడు

    వ్రాసిన వారు Stalin
    Apr 06, 2023
    05:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కష్టపడి పనిచేస్తే ఏదో ఒక రోజు ప్రతిఫలం వస్తుందని నిరూపించిన వారు ఈ ప్రపంచంలో ఎందరో మహానుభావులు ఉన్నారు. బిహార్‌కు చెందిన దిల్‌ఖుష్ కుమార్ కథ కూడా అలాంటి గొప్పవారికి ఏం తీసిపోనిది.

    ఒకప్పుడు రిక్షా పుల్లర్‌గా పనిచేసి, ఆ తర్వాత వీధుల్లో కూరగాయు అమ్మిన బిహార్‌లోని సహర్సా జిల్లాలోని బంగావ్‌‌ గ్రామానికి దిల్‌ఖుష్ కుమార్ ఇప్పుడు ఏకంగా కోట్ల విలువైన రాడ్‌బెజ్ అనే స్టార్టప్‌ను స్థాపించి ఇప్పుడు దానికి వ్యవస్థాపక సీఈవోగా ఉన్నారు.

    12వ తరగతి వరకు చదవుకున్న దిల్‌ఖుష్ కుమార్ ఇప్పుడు ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయెట్లకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు.

    బిహార్

    సెకండ్ హ్యాండ్ టాటా నానోతో రాడ్‌బెజ్‌ కంపెనీ ప్రారంభం

    దిల్‌ఖుష్ కుమార్ సొంతంగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించి బిహార్‌లో టాక్సీ సేవలు అందించాలనుకున్నాడు. ఇందుకోసం రోడ్‌బెజ్‌ అనే సంస్థను ప్రారంభించాడు. అయితే ఇది ఉబర్, ఓలా లాంటిది కాదు. ఇది టాక్సీ డ్రైవర్లతో కస్టమర్‌లను కనెక్ట్ చేసే డేటాబేస్ కంపెనీ.

    50 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఈ కంపెనీ వాహనాలను అందిస్తుంది.

    ఇందులో పని చేయడానికి ఐఐటీ గౌహతి నుంచి గ్రాడ్యుయేట్లను తమ కంపెనీ కోసం నియమించుకున్నట్లు దిల్‌ఖుష్ చెప్పారు.

    దిల్‌ఖుష్ కేవలం సెకండ్ హ్యాండ్ టాటా నానోతో రాడ్‌బెజ్‌ను ప్రారంభించాడు. రాడ్‌బెజ్ ప్రారంభించిన 6-7 నెలల్లోనే దిల్‌ఖుష్ అతని బృందం రూ.4 కోట్ల విలువైన నిధులను సేకరించగలిగారు.

    బిహార్

    తన పాత రోజులను గుర్తు చేసుకుంటూ దిల్‌ఖుష్ భావోద్వేగం

    డిజిటల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పాత రోజులను గుర్తు చేసుకుంటూ దిల్‌ఖుష్ కుమార్ భావోద్వేగానికి గురయ్యాడు.

    తాను దిల్లీలో రిక్షా పుల్లర్‌గా ఉండేవాడినని చెప్పాడు. పాట్నాలోని వీధుల్లో కూరగాయలు కూడా అమ్మేవాడినని వివరించారు.

    తాను గార్డు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు షూ పాలీష్ చేసుకోలేదని, చదువుకోలేదని తిరస్కరించారని చెప్పాడు. ఐఫోన్ లోగోను గుర్తించమని అడిగారని పేర్కొన్నారు. తాను ఆ ఫోన్‌ నమూనాను చూడటం అదే మొదటిసారి అని వివరించాడు.

    దిల్‌ఖుష్ తండ్రి బస్సు డ్రైవర్‌ కావడంతో అతని వద్ద డ్రైవింగ్ నేర్చుకున్నాడు. 12వ తరగతి తర్వాత డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో వాహనం నడపడం ప్రారంభించాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బిహార్
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    బిహార్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    Dream11 jackpot: రూ.49తో బెట్టింగ్ పెట్టి.. కోటీశ్వరుడైన డీజే వర్కర్ భారతదేశం
    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    ఇండిగో విమానంలో మందుబాబుల రచ్చ.. ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులు దిల్లీ

    తాజా వార్తలు

    ప్రపంచంలోనే అత్యంత ప్రజాధారణ పొందిన నేతల జాబితాలో ప్రధాని మోదీ నెంబర్ 1 నరేంద్ర మోదీ
    పరువు నష్టం కేసు: రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ మే 3వ తేదీకి వాయిదా రాహుల్ గాంధీ
    'వంటగ్యాస్ ధరను తగ్గించాలి'; ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు నిరసన సెగ నిర్మలా సీతారామన్
    దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు: మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 17వరకు పొడిగింపు మనీష్ సిసోడియా

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    టార్గెట్ 2024 ఎలక్షన్స్: పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    'కథాకళి' పేరుతో ఒక గ్రామం; శాస్త్రీయ నృత్య రూపానికి అరుదైన గౌరవం కేరళ
    'రాముడిని అల్లానే పంపాడు'; ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్ ఫరూక్ అబ్దుల్లా
    భార్యను అమృత్‌పాల్ సింగ్ తరుచూ కొట్టేవాడు, అమ్మాయిలపై మోజు, థాయ్‌లాండ్‌లో గర్లఫ్రెండ్: నిఘా వర్గాలు పంజాబ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025