మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను నడిపిన బిల్ గేట్స్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, బిలియనీర్ బిల్ గేట్స్ ఇటీవల తన భారత పర్యటనలోని ఆసక్తికర అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను నడిపిన వీడియోను బిల్ గేట్స్ తన ఇన్ స్టాలో షేర్ చేశారు. తన క్లాస్మెట్, వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను కలుసుకున్న సందర్భంలో ఇది జరిగింది. ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియోలో గేట్స్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. మహీంద్రా ట్రియో గురించి మాట్లాడుతూ.. వ్యవసాయం నుంచి రవాణా వరకు ప్రతిదీ సున్నా కార్బన్ ఉద్గారాల వైపు ప్రపంచాన్ని నడిపేందుకు ఆవిష్కరణులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
రవాణా పరిశ్రమను డీకార్బనైజేషన్ చేయడంలో మహింద్రా కృషి స్ఫూర్తిదాయకం
భారతదేశంలోని ఆవిష్కరణలకు తాను ఎలా ఆశ్చర్యపోతున్నానో కూడా బిల్ గేట్స్ తన వీడియోలో చెప్పుకొచ్చారు. ప్రత్యేకంగా మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ రిక్షా గురించి ఆయన మాట్లాడారు. ఇన్నోవేషన్ పట్ల భారతదేశం అభిరుచి ఎప్పటికీ విస్మయానికి గురిచేయదని చెప్పారు. 131కిమీ (సుమారు 81 మైళ్ళు) వేగంతో ప్రయాణించి తాను ఎలక్ట్రిక్ రిక్షాను నడిపానని పేర్కొన్నారు. మహీంద్రా వంటి కంపెనీలు రవాణా పరిశ్రమను డీకార్బనైజేషన్ చేయడానికి దోహదం చేయడం స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు.