NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amith Shah: ఇవాళ హైదరాబాద్‌కి హోంమంత్రి అమిత్ షా.. బీజేపీ మేనిఫెస్టో పేరు తెలుసా 
    తదుపరి వార్తా కథనం
    Amith Shah: ఇవాళ హైదరాబాద్‌కి హోంమంత్రి అమిత్ షా.. బీజేపీ మేనిఫెస్టో పేరు తెలుసా 
    రేపు బీజేపీ మేనిఫెస్టో రిలీజ్

    Amith Shah: ఇవాళ హైదరాబాద్‌కి హోంమంత్రి అమిత్ షా.. బీజేపీ మేనిఫెస్టో పేరు తెలుసా 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 17, 2023
    11:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో హై రేంజ్ పాలిటిక్స్ జోరందుకున్నాయి.ఇప్పుటికే రెండు సార్లు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన చేశారు.

    తాజాగా ఇవాళ కేంద్రహోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణలో రాజధానికి రానున్నారు.

    ఈ క్రమంలోనే పార్టీ మేనిఫెస్టో 'ఇంద్రధనస్సు'ను బేగంపేటలోని హోటల్లో అమిత్ షా రిలీజ్ చేయనున్నారు.

    ఉచిత విద్య,

    ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి ఒక్కరికీ రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం,

    ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌,

    రూ.500కే వంట గ్యాస్ సిలిండర్,

    వ్యవసాయ కూలీలకు ఏటా రూ.20 వేలు,

    వివాహిత మహిళలకు ప్రతి ఏడాది రూ.12 వేలు లాంటి పథకాలపై ప్రకటన చేయనున్నారు.

    Details

    శుక్రవారం రాత్రి 11 గంటలకు బేగంపేటకు రానున్న షా

    జనరిక్ మందుల షాపుల ఏర్పాటు,

    TSPSC జాబ్ క్యాలెండర్, 6 నెలల్లో ఖాళీ పోస్టుల భర్తీపై హామీ ఇవ్వనున్నారు.

    ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు నివాసాలు,

    రైతులు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు,

    బీసీ సబ్ ప్లాన్ వంటి అంశాలు మేనిఫెస్టోలో ఉంటాయని పర్టీ వర్గాలు అంటున్నాయి.

    ఇదే షెడ్యూల్ :

    శుక్రవారం రాత్రి 11 గంటలకు షా బేగంపేట ఎయిర్ పోర్టులో దిగనున్నారు. అనంతరం 11:30 గంటలకు ఐటీసీ కాకతీయలో బస చేయనున్నారు.

    శనివారం ఉదయం 10.30 గంటలకు కత్రియా హోటల్ లో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.

    DETAILS

    అమిత్ షా.. తెలంగాణలో ఫుల్ బిజీ 

    అనంతరం బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో గద్వాలకు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 12.45 గంటల నుంచి 1.20 గంటల వరకు బహిరంగ సభసో పాల్గొననున్నారు.

    అనంతరం 2:45 నుంచి 3:20 గంటల వరకు నల్గొండ, సాయంత్రం 4:10 నుంచి 4:45 వరంగల్ లో పర్యటించారు.

    సుడిగాలి పర్యటనలు చేశాక, బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్ కు 6:10 కు చేరుకోనున్నారు. 6.45 వరకు విశ్రాంతి తీసుకోనున్నారు.

    రాత్రి 7 గంటల నుంచి 7:45 గంటల వరకు సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్​లో ఎమ్మార్పీఎస్ నేతలతో భేటీ కానున్నారు.

    రాత్రి 8: 15 కి బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీకి పయనమవనున్నారు.

    DETAILS

    ఈసారి మేనిఫెస్టోలో నగరాల పేర్లు మార్పు

    తెలంగాణలో రాజకీయ ప్రచారం వేడి అందుతోంది.ఈ క్రమంలోనే రాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపలాడించేందుకు బీజేపీ శాయశక్తుల కృషి చేస్తోంది.

    తాము అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నాయకత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు నగరాలు, పట్టణాల పేర్ల మార్పుపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

    అప్పట్లో హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని బండి సంజయ్ అన్నారు. భైంసాను మహీషగా మారుస్తామన్నారు. నిజామాబాద్ ను ఇందూరుగా మార్చాలని గతంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు.

    ఈ నేపథ్యంలోనే పేరు మార్పు డిమాండ్లన్నీ రేపు విడుదల కానున్న మేనిఫెస్టోలో హామీలుగా వచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    అమిత్ షా

    తాజా

    SRH vs KKR: కోల్‌కతా ఘోర ఓటమి.. హ్యాట్రిక్ విజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించిన సన్ రైజర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్
    Sunrisers Hyderabad: ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన హైద‌రాబాద్.. అత్య‌ధిక స్కోర్ల జాబితా ఆరంజ్ ఆర్మీదే! సన్ రైజర్స్ హైదరాబాద్
    Kakani Govardhan: క్వార్ట్జ్‌ అక్రమాల కేసు.. మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి అరెస్టు కాకాణి గోవర్ధన్ రెడ్డి
    GT vs CSK : గుజరాత్ ఓటమి.. చివరి మ్యాచును విజయంతో ముగించిన సీఎస్కే చైన్నై సూపర్ కింగ్స్

    తెలంగాణ

    SAS Survey: తెలంగాణలో సీట్లు తగ్గినా.. మూడోసారి బీఆర్ఎస్‌దే విజయం.. 'ఆత్మ సాక్షి' సర్వే వెల్లడి  అసెంబ్లీ ఎన్నికలు
    నేడు తెలంగాణకు ప్రియాంక గాంధీ.. రేపు రాహల్ రాక.. ఊపందుకున్న కాంగ్రెస్ ప్రచారం ప్రియాంక గాంధీ
    KCR Rajshyamala yagam: ఫాంహౌస్‌లో కేసీఆర్ రాజశ్యామలా యాగం.. మూడోసారి గెలుపు వరిస్తుందా?  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    VivekVenkataswamy: బీజేపీకి దెబ్బ మీద దెబ్బ.. కమలం పార్టీకి వివేక్ రాజీనామా  బీజేపీ

    అమిత్ షా

    దిల్లీలో అమిత్ షాను కలిసిన చంద్రబాబు- వచ్చేవారం ఏపీకి బీజేపీ అగ్రనేతలు; పొత్తు  కొసమేనా?  ఆంధ్రప్రదేశ్
    మణిపూర్‌లో హింసను అరికట్టాలని అమిత్ షా ఇంటి ఎదుట 'కుకీ' తెగ మహిళల నిరసన  మణిపూర్
    మణిపూర్ నిర్వాసితుల సహాయార్థం రూ.101 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం మణిపూర్
    రెండో రోజూ దిల్లీలోనే ఈటల.. ఏ క్షణంలోనా కీలక ప్రకటన వచ్చే అవకాశం ఈటల రాజేందర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025