NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణ ప్రభుత్వంపై బండి సంజయ్ హాట్ కామెంట్స్.. రూ.లక్ష కోట్ల కోసమే ఆర్టీసీ విలీనమని ఆరోపణ
    తదుపరి వార్తా కథనం
    తెలంగాణ ప్రభుత్వంపై బండి సంజయ్ హాట్ కామెంట్స్.. రూ.లక్ష కోట్ల కోసమే ఆర్టీసీ విలీనమని ఆరోపణ
    .లక్ష కోట్ల కోసమే విలీనమని ఆరోపణ

    తెలంగాణ ప్రభుత్వంపై బండి సంజయ్ హాట్ కామెంట్స్.. రూ.లక్ష కోట్ల కోసమే ఆర్టీసీ విలీనమని ఆరోపణ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 06, 2023
    04:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

    రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆరా లేక కేటీఆరా అంటూ హాట్ కామెంట్స్ చేశారు.

    సీఎంగా కేటీఆర్‌ను ప్రకటిస్తే బీఆర్‌ఎస్‌ పార్టీ ఖాళీ అవుతుందన్నారు. బీజేపీ స్టేట్ చీఫ్‌గా బండి సంజయ్ ఉన్నప్పుడు బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై రాజకీయ యుద్ధం చేశారు. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న బండి సంజయ్ ఈ మేరకు మళ్లీ రాజకీయ వేడి పుట్టిస్తున్నారు.

    ప్రభుత్వ విధానాలను టీఎస్ఆర్టీసీ కార్మికులు గ్రహిస్తున్నారన్న సంజయ్, లక్ష కోట్ల ఆర్టీసీ ఆస్తులను కొట్టేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.

    DETAILS

    వాటిని వీలిన బిల్లులో ఎందుకు పేర్కొనలేదని బండి సంజయ్ ప్రశ్న

    రైల్వే పనులను కేంద్రమే చేపడుతోందని బండి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాటలు నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరన్నారు.

    ప్రభుత్వం 15-20 కోట్ల ఆ‍ర్టీసీ నిధులు వాడుకుందని, విలీన బిల్లులో వాటి గురించి ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించారు.

    కార్మికుల సీసీఎస్‌ సొమ్ము దాదాపు రూ.4,500 కోట్లు, పీఎఫ్‌ నిధులు రూ.9 వేల కోట్లను సైతం కేసీఆరే వాడుకున్నారన్నారు. కార్మికులకు తిరిగి ఎవరు ఇస్తారని ప్రశ్నించారు.

    కరీంనగర్, ఆర్మూర్‌లోని ఆర్టీసీ ఆస్తులను ఇప్పటికే లీజు పేరుతో కొల్లగొట్టారని మండిపడ్డారు.

    ఆర్టీసీ ఆస్తుల కోసమే విలీనం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. బిల్లులో ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన బెనిఫిట్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదని అడిగారు.

    DETAILS

    ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం గవర్నర్ కృషి చేస్తున్నారు : బండి

    త్వరలోనే సీఎం కేసీఆర్‌ చేస్తున్న కుట్రలు బయటకు వస్తాయని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల ఓట్ల కోసమే విలీనం చేస్తామంటున్నారని బండి విమర్శించారు. కార్మికులకు లాభం చేకూర్చేందుకే గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కృషి చేస్తున్నారన్నారు.

    గ్రామ పంచాయతీ కార్మికులకు తక్షణమే జీతాలను చెల్లించాలన్నారు. ఓ వైపు వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కేసీఆర్‌ మాత్రం మహారాష్ట్రలో రాజకీయ సభలు పెట్టుకుంటున్నారన్నారు. మంత్రి కేటీఆర్‌ భాష, అహంకారం చూసి ప్రజలు తిరగబడుతున్నట్లు బండి పేర్కొన్నారు.

    అంతకుముందు మంత్రి కేటీఆర్ బండికి తుప్పు పట్టిపోయిందని ఘాటుగా విమర్శించారు. దీనికి స్పందించిన బండి, కారుకే తుప్పుపట్టిందని కౌంటర్ విసిరడంతో మళ్లీ రాజకీయం వేడిగా మారుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ
    బండి సంజయ్
    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    తాజా

    Prof S Mahendra Dev: ప్రధానికి ఆర్థిక సలహామండలి ఛైర్మన్‌గా సూర్యదేవర మహేంద్రదేవ్‌    కేంద్ర ప్రభుత్వం
    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు

    బీజేపీ

    గిరిజన హక్కులపై 'యూనిఫాం సివిల్ కోడ్' ప్రభావం ఉండదు: కేంద్రమంత్రి బఘేల్ కేంద్రమంత్రి
    కేంద్రమంత్రి పదవిపై దిల్లీ పెద్దల మాటకు కట్టుబడి ఉంటా : కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి
    NCP Crisis: మామ మీకు 83ఏళ్లు, రిటైర్ అవ్వండి; శరద్ పవార్‌పై అజిత్ విమర్శలు  మహారాష్ట్ర
    NCP crisis: పార్టీ గుర్తు ఎక్కడికీ పోలేదు, ప్రజలు, కార్యకర్తలు మనతోనే ఉన్నారు: శరద్ పవార్  శరద్ పవార్

    బండి సంజయ్

    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? బీజేపీ
    చిక్కుల్లో బండి సంజయ్ కుమారుడు, తోటి విద్యార్థులపై దాడి చేసిన వీడియోలు వైరల్ బీజేపీ
    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ తెలంగాణ
    కవితపై బండి సంజయ్ కామంట్స్; దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ హైదరాబాద్

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    వైజాగ్ స్టీల్ ప్లాంట్‌‌ను వేలంలో దక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ విశాఖపట్టణం
    పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ సస్పెన్షన్‌ వేటు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
    దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా జగన్మోహన్ రెడ్డి; ఏడీఆర్‌ వెల్లడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    125 అడుగుల ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్  తెలంగాణ

    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    సత్య నాదెళ్లను కలిసిన కేటీఆర్: బిజినెస్, హైదరాబాద్ బిర్యానీపై చర్చ సత్య నాదెళ్ల
    తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుకండి: కేటీఆర్ స్విట్జర్లాండ్
    కేటీఆర్: తెలంగాణలో గ్లోబల్ రెస్టారెంట్ కంపెనీ 'ఇన్‌స్పైర్ బ్రాండ్స్' పెట్టుబడులు తెలంగాణ
    హైదరాబాద్‌లో అమెజాన్ ఎయిర్ సేవలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ అమెజాన్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025