NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అర్థరాత్రి నరేంద్ర మోదీ నివాసంలో బీజేపీ ఉన్నత స్థాయి కీలక సమావేశం.. సార్వత్రిక ఎన్నికలపై చర్చ 
    తదుపరి వార్తా కథనం
    అర్థరాత్రి నరేంద్ర మోదీ నివాసంలో బీజేపీ ఉన్నత స్థాయి కీలక సమావేశం.. సార్వత్రిక ఎన్నికలపై చర్చ 
    అర్థరాత్రి నరేంద్ర మోదీ నివాసంలో బీజేపీ ఉన్నత స్థాయి కీలక సమావేశం

    అర్థరాత్రి నరేంద్ర మోదీ నివాసంలో బీజేపీ ఉన్నత స్థాయి కీలక సమావేశం.. సార్వత్రిక ఎన్నికలపై చర్చ 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 29, 2023
    10:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసంలో బుధవారం అర్ధరాత్రి బీజేపీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

    ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ సీనియర్‌ నేతలు హాజరయ్యారు.

    జులై 17 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి.ఈ మేరకు బీజేపీ కీలక నేతలంతా అర్ధరాత్రి సమావేశమై చర్చించినట్టు తెలుస్తోంది.

    మరోవైపు ప్రధాని మోదీ ఇటీవలే అమెరికా, ఈజిప్ట్‌ పర్యటనను ముగించుకుని స్వదేశానికి వచ్చారు. అప్పటి నుంచి వరుసగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

    రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనే బీజేపీ ఎన్నికల సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే హై కమిటీ సమావేశం జరిగినట్టు సమాచారం.

    DETAILS

    త్వరలోనే బీజేపీ 2024 ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్

    అర్థరాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ ఎలక్షన్ స్ట్రాటజీ కమిటీ అభ్యర్థుల జాబితాను తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

    బీజేపీ మేనిఫెస్టో రూపకల్పన పైనా కీలక చర్చలు చేశారని వెల్లడవుతోంది. ఎన్నికల అంశంతో పాటు ప్రధానంగా వర్షాకాల సమావేశాల్లోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయాలనే అంశం చర్చకు వచ్చినట్టు అనుకుంటున్నారు.

    యూనిఫామ్‌ సివిల్‌కోడ్‌పై బిల్లు పెడతామని తాజాగా భోపాల్ సభలో మోదీ చెప్పారు. అయితే అదే అంశాన్ని మేనిఫెస్టోలోనూ పొందుపరిచేందుకు ఆలోచనలు చేస్తున్నట్లు కీలక పార్టీ నేత తెలిపారు.

    ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగానే 2024 సార్వత్రిక ఎన్నికల కోసం త్వరలోనే బీజేపీ తొలి జాబితాను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని స్పష్టమవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతీయ జనతా పార్టీ/బీజేపీ

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    భారతీయ జనతా పార్టీ/బీజేపీ

    'బీజేపీ నాకు గురువులాంటింది'.. కమలం పార్టీపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు భారత జాతీయ కాంగ్రెస్/కాంగ్రెస్ పార్టీ
    టార్గెట్ 2024: కేంద్ర మంత్రివర్గం, బీజేపీలో భారీ మార్పులకు మోదీ స్కెచ్ నరేంద్ర మోదీ
    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు బిహార్
    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ అమిత్ షా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025