NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మహిళా ఎంపీగా కాదు, సాటి మ‌హిళ‌గానే స్పందిస్తున్నా: ప్రీతమ్ ముండే 
    తదుపరి వార్తా కథనం
    మహిళా ఎంపీగా కాదు, సాటి మ‌హిళ‌గానే స్పందిస్తున్నా: ప్రీతమ్ ముండే 
    పోలీసులు ఫిర్యాదు తప్పనిసరిగా తీసుకోవాలి : ఎంపీ ప్రీతమ్

    మహిళా ఎంపీగా కాదు, సాటి మ‌హిళ‌గానే స్పందిస్తున్నా: ప్రీతమ్ ముండే 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 02, 2023
    04:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బ్రిజ్ భూష‌ణ్ వ్య‌వ‌హారంపై భాజపా నాయకులెవ్వరూ పట్టించుకోకపోయినా ఆ అంశంపై మ‌హారాష్ట్ర‌ భాజపా మహీళా ఎంపీ ప్రీత‌మ్ ముండే మాత్రం స్పందించారు. మ‌హిళ ఎవ‌రైనా గానీ ఫిర్యాదు చేస్తే ముందుగా ఆ అంశాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని ఆమె సూచించారు.

    అనంతరం ఆ ఫిర్యాదు సరైందా కాదా అనే కోణంలో విచార‌ణ చేయాలని, తదనంతరమే తుది నిర్ణ‌యం చేయాలని ఆమె అభిప్రాయపడ్డారు. మహాలోని బీడ్ జిల్లాలో పాత్రికేయులతో ఎంపీ మాట్లాడారు. రెజ్ల‌ర్ల ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో బ్రిజ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎంపీ ఆకాంక్షించారు.

    ఓ పార్ల‌మెంట్ మెంబర్ గా కాకుండా, సాటి మ‌హిళ‌గానే ఈ విషయంపై అభ్య‌ర్థ‌ిస్తున్నట్లు చెప్పారు. ఉమెన్ రెజ్ల‌ర్ల ఆరోప‌ణ‌లపై ఎంపీ బ్రిజ్‌పై కఠినంగా వ్యవహరించాలని ప్రీత‌మ్ అభిప్రాయ‌ప‌డ్డారు.

    Women Mp Preetham Munde Responded 

    బాధితులతో ప్రభుత్వం సరైన రీతిలో చర్చించలేదు : మహిళా ఎంపీ 

    మహిళపై లైంగిక వేధింపుల లాంటి తీవ్రమైన కేసుల్లో బాధితులు చేసిన ఫిర్యాదు పట్ల పోలీసులు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే దాన్ని ప్ర‌జాస్వామ్యంలో స్వాగ‌తించ‌లేమ‌న్నారు.

    ప్ర‌స్తుత కేంద్రంలో తాను భాగ‌స్వామ్యురాలునే అయినా, రెజ్ల‌ర్ల‌తో సర్కార్ సరిగ్గా స్పందించలేదని, సరైన చర్చలు జ‌ర‌ప‌లేద‌నే విషయాన్ని తానూ అంగీక‌రించాల్సి వ‌స్తోందనే విషయాన్ని బాధతప్త హృదయంతో ముండే ఆవేదన వ్యక్తం చేశారు.

    భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ప్రకారం దేశం ప్రాధాన్యమని, తర్వాతే వ్యక్తి అని ఆమె అన్నారు. అయినప్పటికీ, ఒకరి వ్యక్తిగత ఆలోచనలు కూడా ముఖ్యమైనవేనని చెప్పుకొచ్చారు.

    ముండే అక్కాచెల్లెళ్లు ఎవరో కాదు, దివంగత భాజపా నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే. ఆయన సంతానంలో ఒకరైన ప్రీతమ్ ముండేనే ఈ మహిళా ఎంపీ.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    రెజ్లింగ్

    తాజా

    PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ నరేంద్ర మోదీ
    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ

    భారతీయ జనతా పార్టీ/బీజేపీ

    'బీజేపీ నాకు గురువులాంటింది'.. కమలం పార్టీపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు భారత జాతీయ కాంగ్రెస్/కాంగ్రెస్ పార్టీ
    టార్గెట్ 2024: కేంద్ర మంత్రివర్గం, బీజేపీలో భారీ మార్పులకు మోదీ స్కెచ్ నరేంద్ర మోదీ
    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు బిహార్
    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ అమిత్ షా

    రెజ్లింగ్

    అనురాగ్ ఠాకూర్‌తో భారత రెజ్లర్ల సమావేశం, డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడి రాజీనామాకు డిమాండ్ అనురాగ్ సింగ్ ఠాకూర్
    డబ్ల్యూఎఫ్‌ఐ వివాదం: విచారణ పూర్తయ్యే వరకు బ్రిజ్ భూషణ్ పదవిలో ఉండరు: అనురాగ్ ఠాకూర్ అనురాగ్ సింగ్ ఠాకూర్
    రెజర్ల ఆందోళనపై ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు సుప్రీంకోర్టు
    ప్రాథమిక దర్యాప్తు తర్వాత బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదు చేస్తాం  సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025