NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Himachal crisis: సంక్షోభంలో హిమాచల్ సర్కార్.. అవిశ్వాస తీర్మానానికి బీజేపీ సన్నద్ధం.. రంగంలోకి డీకే శివకుమార్
    తదుపరి వార్తా కథనం
    Himachal crisis: సంక్షోభంలో హిమాచల్ సర్కార్.. అవిశ్వాస తీర్మానానికి బీజేపీ సన్నద్ధం.. రంగంలోకి డీకే శివకుమార్
    Himachal crisis: సంక్షోభంలో హిమాచల్ సర్కార్.. అవిశ్వాస తీర్మానానికి బీజేపీ సన్నద్ధం.. రంగంలోకి డీకే శివకుమార్

    Himachal crisis: సంక్షోభంలో హిమాచల్ సర్కార్.. అవిశ్వాస తీర్మానానికి బీజేపీ సన్నద్ధం.. రంగంలోకి డీకే శివకుమార్

    వ్రాసిన వారు Stalin
    Feb 28, 2024
    09:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం చిక్కుల్లో పడింది.

    ఎమ్మెల్యేల తిరుగుబాటు కారణంగా రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాల్సిన ఒక్క సీటును కోల్పోవాల్సి వచ్చింది.

    రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఫలితంగా.. ఇప్పుడు సుఖ్వీందర్ సింగ్ సుఖు నేతృత్వంలోనికి కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకమైంది.

    మంగళవారం జరిగిన రాజ్యసభ పోలింగ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‍‌కు పాల్పడటంతో బీజేపీ అభ్యర్థి గెలిచారు.

    దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు బిజెపి సిద్ధమవుతోంది.

    ఇదే సమయంలో ఎమ్మెల్యేలు చేయిదాటిపోకుండా ఉండేందుకు, ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది.

    ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యతను భూపేంద్ర సింగ్ హుడా, డీకే శివకుమార్‌లకు అప్పగించారు. వీరద్దరూ బుధవారం ఉదయం సిమ్లాకు బయలుదేరారు.

    హిమాచల్

    హిమాచల్ రాజ్యసభ ఎన్నికల్లో ఏం జరిగింది?

    హిమాచల్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ క్రాస్ ఓటింగ్ కారణంగా బీజేపీకి చెందిన హర్ష్ మహాజన్ చేతిలో ఓడిపోయారు.

    హిమాచల్ అసెంబ్లీలో 68సీట్లు ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 40సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

    తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి 34ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి కూడా 34ఓట్లు రావడం గమనార్హం. దీంతో డ్రా వేయగా.. బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.

    పోలైన ఓట్లను బట్టి చూస్తే.. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డట్లు స్పష్టమవుతోంది.

    దీంతో కాంగ్రెస్‌కు అసెంబ్లీలో బలం లేదని నిరూపితమైందని, అందుకే తాము అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు బీజేపీ నాయకుడు జైరాం ఠాకూర్ తెలిపారు. ఇందుకోసం గవర్నర్‌ను కలవనున్నట్లు వెల్లడించారు.

    హిమాచల్

    ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో చర్చలు..

    సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం అప్రమత్తమైంది. అసంతృప్త ఎమ్మెల్యేలను ఒప్పించే పనిలో నిమగ్నమైంది.

    ఆరుగురు ఎమ్మెల్యేలతో చర్చలు జరిపేందుకు సీనియర్ నేతలు భూపేంద్ర సింగ్ హుడా, డీకే శివకుమార్‌లను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నియమించారు.

    ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు వ్యవహార శైలి పట్ల నిరాశ చెందారని, ఆయనను తొలగించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

    అయితే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఆరుగురు ఎమ్మెల్యేలు ప్రస్తుతం హిమాచల్‌లో లేరని సమాచారం. వారు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయగానే.. సిమ్లా నుంచి హర్యానాకు బయలుదేరినట్లు తెలుస్తోంది.

    బీజేపీ అధిష్టానం సూచన మేరకు వారు హర్యానాకు వెళ్లినట్లు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హిమాచల్ ప్రదేశ్
    రాజ్యసభ
    పోలింగ్
    ఎన్నికలు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    హిమాచల్ ప్రదేశ్

    హైవేపై విరిగి పడ్డ కొండచరియలు, చిక్కుకుపోయిన 53మంది ప్రయాణికులు ప్రయాణం
    తమ సంస్థలో ఎటువంటి అక్రమాలు జరగడం లేదంటున్న అదానీ విల్మార్ ప్రతినిధులు అదానీ గ్రూప్
    దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా? ఆర్మీ
    హిమాచల్‌ ప్రదేశ్‌ను వణికిస్తున్న వర్షాలు, మంచు; హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ భారతదేశం

    రాజ్యసభ

    మణిపూర్‌ పరిస్థితిపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్: ఈ నెల 24న నిరసన మణిపూర్
    రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ.. వర్షాకాల సమావేశాల నుంచి ఎంపీ సంజ‌య్ సింగ్‌ స‌స్పెండ్ ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    YSRCP: రాజ్యసభలో కేంద్రానికి వైసీపీ మద్దతు; 'దిల్లీ ఆర్డినెన్స్‌' ఆమోదం ఇక లాంచనమే దిల్లీ ఆర్డినెన్స్
    సినిమా పైరసీ చేస్తే 3 ఏళ్లు జైలు శిక్ష.. బిల్ పాస్ చేసిన రాజ్యసభ ఇండియా

    పోలింగ్

    అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో బీజేపీ ఆధిక్యం; మేఘాలయలో ఎన్‌పీపీ హవా అసెంబ్లీ ఎన్నికలు
    ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో కమల వికాసం; మేఘాలయలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఎన్‌పీపీ అసెంబ్లీ ఎన్నికలు
    అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక‌లో రేపే పోలింగ్; ముఖ్యాంశాలు ఇవే కర్ణాటక
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: కొనసాగుతున్న పోలింగ్; ఓటేసిన ప్రముఖులు కర్ణాటక

    ఎన్నికలు

    Telangana : తెలంగాణలో మహిళా ఓటర్లదే హవా.. పురుషులు ఎంత మందో తెలుసా తెలంగాణ
    Madhyapradesh Elections: మధ్యప్రదేశ్‌లో నేడు పోలింగ్.. కీలక నియోజకవర్గంలో గెలుపు ఎవరిది? మధ్యప్రదేశ్
    'one nation, one election': జమిలీ ఎన్నికలతో కేంద్రానికి మేలు: మాజీ రాష్ట్రపతి కోవింద్  జమిలి ఎన్నికలు
    Madhya Pradesh: బీజేపీకి ఓటు వేయని వారికి తాగునీరు బంద్: మధ్యప్రదేశ్ మంత్రి  బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025