NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rameshwaram Cafe blast:రామేశ్వరం కేఫ్‌లో పేలుడు కేసు.. ఎన్‌ఐఏ అదుపులో బీజేపీ కార్యకర్త
    తదుపరి వార్తా కథనం
    Rameshwaram Cafe blast:రామేశ్వరం కేఫ్‌లో పేలుడు కేసు.. ఎన్‌ఐఏ అదుపులో బీజేపీ కార్యకర్త
    రామేశ్వరం కేఫ్‌లో పేలుడు కేసు.. ఎన్‌ఐఏ అదుపులో బీజేపీ కార్యకర్త

    Rameshwaram Cafe blast:రామేశ్వరం కేఫ్‌లో పేలుడు కేసు.. ఎన్‌ఐఏ అదుపులో బీజేపీ కార్యకర్త

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 05, 2024
    05:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకున్నట్లు కన్నడ వార్తా వెబ్‌సైట్ పబ్లిక్ టీవీ పేర్కొంది.

    కర్ణాటకలోని షిమోగా జిల్లా తీర్థహళ్లి నుంచి సాయిప్రసాద్ అనే బీజేపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్నారు.

    కథనం ప్రకారం సాయిప్రసాద్‌ను ఎన్‌ఐఏ అధికారులు విచారణకు పిలిచారు. గత వారం, తీర్థహళ్లిలోని ఇద్దరు ముస్లిం యువకుల ఇళ్లు, మొబైల్ షాపులపై అధికారులు దాడులు చేశారు.

    వీరిద్దరితో సాయిప్రసాద్‌కు సంబంధాలున్నట్లు విచారణలో తేలిందని నివేదిక పేర్కొంది. దీంతో అధికారులు సాయిప్రసాద్‌ను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు.

    Details 

    హుస్సేన్ , తాహా ఇద్దరినీ అరెస్టు చేయాల్సి ఉంది

    మార్చి 13న రామేశ్వరం కేఫ్ పేలుడు కేసును స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ గత నెలలో ముజమ్మిల్ షరీఫ్‌ను అరెస్టు చేసింది.

    ఈ పేలుడుకు షరీఫ్‌ కీలక సూత్రధారి. కర్నాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వహించిన తర్వాత అతని అరెస్టు జరిగింది.

    ఈ పేలుడుకు పాల్పడ్డ ప్రధాన నిందితుడు ముస్సావిర్ షజీబ్ హుస్సేన్, మరో కుట్రదారుడు అబ్దుల్ మతీన్ తాహాలను ఏజెన్సీ ప్రాథమికంగా గుర్తించింది.

    హుస్సేన్ , తాహా ఇద్దరినీ ఇంకా అరెస్టు చేయాల్సి ఉంది. మార్చి 1న బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్ పరిసరాల్లోని ITPL రోడ్డులో ఉన్న తినుబండారం వద్ద పేలుడు జరిపేందుకు IEDని ఉపయోగించారని అధికారులు వెల్లడించారు.

    ఈ పేలుడులో పలువురు గాయపడ్డారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    పబ్లిక్ టివి చేసిన ట్వీట్ 

    ರಾಮೇಶ್ವರಂ ಕೆಫೆ ಸ್ಫೋಟ – ಬಿಜೆಪಿ ಕಾರ್ಯಕರ್ತನನ್ನು ಸಾಕ್ಷಿಯನ್ನಾಗಿ ಪರಿಗಣಿಸಿದ ಎನ್‌ಐಎ https://t.co/RcqYp1A7hS#NIA #RameshwaramCafeBlast #Bengaluru #BengaluruBlast #Karnataka #NIA #Whitefield #RameshwaramCafe

    — PublicTV (@publictvnews) April 5, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ

    Mohammed Gaus Niyazi: మోస్ట్-వాంటెడ్ గ్యాంగ్‌స్టర్,ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త హత్య నిందితుడు.. దక్షిణాఫ్రికాలో అరెస్ట్  భారతదేశం
    NIA : బెంగుళూరు జైలురాడికలైజేషన్ కేసు.. 7 రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో NIA దాడులు భారతదేశం
    Bengaluru Cafe Blast Case: బెంగళూరు కేఫ్ పేలుడు ప్రధాన నిందితుడు గుర్తింపు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025